ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యాదాద్రిలో గిరి ప్రదక్షిణకు పోటెత్తిన స్వాములు

ABN, Publish Date - Dec 01 , 2025 | 09:27 AM

యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం చుట్టూ సోమవారం తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఈ గిరి ప్రదక్షిణలో భారీగా అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

1/9

ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదాద్రి (యాదగిరిగుట్ట)లో శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం చుట్టూ సోమవారం తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభమైంది.

2/9

వైకుంఠ ద్వారం వద్ద ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ గిరి ప్రదక్షిణలో ఆయన పాల్గొన్నారు.

3/9

ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా గోవుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆవు సైతం ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంది.

4/9

యాదగిరిగుట్ట దేవస్థానం, స్థానిక అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ గిరి ప్రదక్షిణకు స్వాములు పోటెత్తారు.

5/9

చిన్న పెద్దలు అంతా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.

6/9

అయ్యప్ప స్వామి, నరసింహ స్వామిల నామస్మరణ, భజనలు, భక్తి గీతాలాపనతో అయ్యప్ప స్వాములు ఈ ప్రదక్షిణ చేపట్టారు.

7/9

గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ఆలయ పరిసర రహదారులన్నీ స్వాములతో కిక్కిరిసి పోయాయి.

8/9

సోమవారం ఏకాదశి కావడంతో.. ఆలయ పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ గిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలి రావడంతో.. దేవస్థానం సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

9/9

గిరి ప్రదక్షిణకు అసంఖ్యాకంగా భక్తులు తరలి రావడంతో లక్ష్మీనరసింహుడు, అయ్యప్ప స్వాముల నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి.

Updated Date - Dec 01 , 2025 | 09:27 AM