భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా గజారోహణం
ABN, Publish Date - Dec 15 , 2025 | 12:36 PM
శ్రీనగర్ కాలనీ అయ్యప్ప ఆలయ గజారోహణ కార్యక్రమం ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆధ్యాత్మిక నినాదాలు మిన్నంటాయి. అయ్యప్ప భక్తుల కోలాటాలతో దారులన్నీ భక్తిసంద్రంగా మారాయి.
శ్రీనగర్ కాలనీ అయ్యప్ప ఆలయ గజారోహణ కార్యక్రమం ఆదివారం నాడు కనుల పండువగా జరిగింది.
స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆధ్యాత్మిక నినాదాలు మిన్నంటాయి.
శబరిమల మాజీ మేల్ శాంతి మనోజ్ నంబూద్రి ఆధ్వర్యంలో పడిపూజ, భగవతి సేవ వైభవంగా జరిగింది.
అయ్యప్ప భక్తుల కోలాటాలు ప్రదర్శించగా.. దారులన్ని అయ్యప్ప నామస్మరణతో భక్తిసంద్రంగా మార్మోగాయి.
ఆలయ ఈఓ శ్రీనివాస శర్మ, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అర్జున్ యాదవ్ ఊరేగింపును ప్రారంభించారు.
అయ్యప్ప మండల పూజల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, గణపతి హోమం నిర్వహించారు.
అనంతరం శబరిమల తరహాలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 5నుంచి అయ్యప్ప స్వామికి ఆభరణాల ఊరేగింపు నిర్వహించారు.
ఏనుగు అంబారీపై అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. దేవతా మూర్తుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.
శ్రీనగర్ కాలనీ, ఇందిరానగర్, కృష్ణానగర్, యూసఫ్గూడ, శాలివాహననగర్, ఆర్బీఐ క్వార్టర్స్, ఎల్లారెడ్డిగూడ మీదుగా ఊరేగింపు అయ్యప్ప ఆలయానికి చేరుకుంది.
కేరళా తరహా మేళతాళాలు, దేవతామూర్తుల వేషాధారణలు ఆకట్టుకున్నాయి. ఆలయ అర్చకులు శ్రీనివాస. శర్మ, రామకృష్ణశర్మలు పూజాధికాలను దగ్గరుండి పర్యవేక్షించారు.
Updated Date - Dec 15 , 2025 | 12:49 PM