Yogandhra: భీమవరంలో యోగాంధ్ర కార్యక్రమం.. పాల్గొన్న కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ
ABN, Publish Date - Jun 20 , 2025 | 04:05 PM
పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం డీఎన్ఆర్ కళాశాల గ్రౌండ్స్లో ఈరోజు(శుక్రవారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది.
పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం డీఎన్ఆర్ కళాశాల గ్రౌండ్స్లో ఈరోజు(శుక్రవారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
దాదాపు ఐదువేల మంది యోగాసానాలు వేశారు.
కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ , కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, జిల్లా కలెక్టర్ సి.నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, పలువురు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
యోగాసానాలు వేస్తున్న ప్రజలు
యోగాసానాలు వేస్తున్న చిన్నారులు
గాల్లోకి బెలూన్లను వదులుతున్న ప్రముఖులు
యోగాపై ఆసక్తి పెరిగేలా కొనసాగిన ఈ కార్యక్రమంలో అందరితో కలిసి యోగాసనాలు చేయడం ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందని కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు.
ఆరోగ్యవంతమైన, సుఖసమృద్ధి జీవితం కోసం మనమంతా యోగా వైపు అడుగులు వేయాలని రఘురామకృష్ణ రాజు అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది.
Updated Date - Jun 20 , 2025 | 05:22 PM