ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోదం

ABN, Publish Date - Oct 04 , 2025 | 06:47 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో చర్చించారు సీఎం చంద్రబాబు.

1/8

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరిగింది.

2/8

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో చర్చించారు సీఎం చంద్రబాబు.

3/8

రాజధాని అమరావతిలో పనుల వేగవంతం కోసం, ప్రత్యేక ప్రాజెక్టుల అమలు కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను (ఎస్పీవీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది.

4/8

కంపెనీ చట్టం కింద దీనిని ఏర్పాటు చేస్తారు. అలాగే, గతంలో భూసేకరణ నోటిఫికేషన్‌ నుంచి 343.36 ఎకరాల భూమిని ఉపసంహ రించుకునేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు కేబినెట్ అనుమతి ఇచ్చింది.

5/8

నీటి సంఘాల సభ్యుల ఎంపికకు, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు సంబంధించి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించింది.

6/8

ఇందుకోసం రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా, ఈ పదవుల్లో కొనసాగటానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

7/8

రాజధాని అమరావతికి ల్యాండ్ పూలింగ్ కోసం కొందరు రైతులు భూములు ఇవ్వలేదు. వారి నుంచి భూసేకరణ చట్టం 2013 ద్వారా భూములు తీసుకోవాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

8/8

కేబినెట్ సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత

Updated Date - Oct 04 , 2025 | 06:48 AM