Home » AP Cabinet Meet
అసెంబ్లీ సమావేశాలు మొదలైన నేపథ్యంలో మంత్రుల పనితీరు, ప్రవర్తనపై సీఎం చంద్రబాబు స్పష్టమైన మార్గదర్శకాలిచ్చారు. సమయపాలన ఉండాలని, బాధ్యతాయుత ప్రసంగాలు చేయాలని.. అసెంబ్లీలో 'ఆవు కథలు' చెప్పవద్దని సూచించారు.
టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై సిట్ ఇచ్చిన నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పూర్తిగా టెండర్ నిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నెయ్యి కల్తీ అంశంలో సిట్ ఇచ్చిన నివేదకపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంలో విస్తుపోయే అంశాలు బయటపడుతున్నాయని మంత్రులు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ప్రధానంగా టీటీడీ లడ్డు నెయ్యి కల్తీపైనే చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.
నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ భవిష్యత్తుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చిస్తున్నారు.
ఏపీ మంత్రి మండలి సమావేశం జనవరి 8న జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో సోమవారం మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై చర్చించారు.
21 అంశాలు అజెండాగా ఏపీ మంత్రి మండలి సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత జరుగుతున్న ఈ సమావేశంలో కొత్త జిల్లాలకు సంబంధించి చర్చ జరుగనుంది.