Chandrababu Srisailam: శ్రీశైలంలో సీఎం చంద్రబాబు.. భ్రమరాంబ మల్లికార్జునులకు ప్రత్యేక పూజలు..
ABN, Publish Date - Jul 08 , 2025 | 04:49 PM
Chandrababu Naidu Srisailam Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైల పర్యటనలో ఉన్నారు.
ఈ సందర్భంగా శ్రీశైల మల్లన్నను, భ్రమరాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆయనకు ఆలయ అధికారులు, పండితులు ఘనంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు.
జలహారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ ఆయన శ్రీశైలం విచ్చేశారు.
అంతకుముందు సున్నిపెంట హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు, అధికారులు, కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
మల్లన్న సేవ అనంతరం సీఎం జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు.
Updated Date - Jul 08 , 2025 | 05:03 PM