Home » Srisailam Reservoir
కృష్ణమ్మ ఎగువ నుంచి పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. భారీ వరద కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,57,059 క్యూసెక్కులు ప్రవహిస్తోంది.
రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎల్నినో నేపథ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి కోసం భద్రపరచుకోవాలని అన్నారు.
శ్రీశైలం జలాశయంలో నీటినిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ఐదు రోజుల కిందట ప్రవాహం మొదలై 820 అడుగుల నుంచి పెరుగుతూ వస్తున్న కృష్ణమ్మ.. సోమవారం సాయంత్రానికి 855.10 అడుగులకు చేరింది.
శ్రీశైలం రిజర్వాయర్కు ఎగువ జూరాల స్పిల్వే, సుంకేసుల, హంద్రీ నుంచి డ్యాంకు 3.58లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లోగా వచ్చి చేరాయి. శ్రీశైలం పది గేట్ల ద్వారా సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. వరద వేగం పుంజుకోవడంతో గేట్ల ఎత్తును 14 అడుగులకు ఇంజనీర్లు పెంచారు.
శ్రీశైలం జలాశయం 3, 10 రేడియల్ క్రస్టు గేట్ల నుంచి నీరు లీక్ అవుతోంది. జలాశయానికి వరద ప్రవాహం...
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందే జల విద్యుదుత్పాదన కోసం అని, నీటి మళ్లింపునకు కాదని తెలంగాణ స్పష్టం చేసింది.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. శనివారం 4.69 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో ప్రాజెక్టు అధికారులు పది గేట్లు ఎత్తి 4.19 లక్షల క్యూసెక్కులను నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్ 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 39 గేట్లు ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి దిగవ భాగానికి 1.51లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. శ్రీశైలానికి 3.29 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని.. చెప్పారు.
ఉత్తరాది రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉదృతి పెరగడంతో రాష్ట్రంలోని పలు డ్యాముల గేట్లను అధికారులు ఎత్తారు.