Home » Srisailam
శ్రీశైలం జలాశయంలోకి వరద నిలకడగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు వెంటాడుతున్నా.. ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తుతోంది.
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో స్వామివారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది.
రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, తగిన వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక పూజలు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
శ్రీశైలం దేవస్థానంలో ఆగస్టు 15వ తేదీ నుంచి వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. వీఐపీల రెఫరల్ లేఖలు 48 గంటల ముందే దేవస్థానం కార్యాలయానికి చేర్చాలని సూచించారు.
శ్రీశైలం దేవస్థానంలో ఆన్లైన్ టికెట్ల బుకింగ్లో ఇబ్బందులు, ఆన్లైన్ వెబ్సైట్తో పాటు మనమిత్ర యాప్లో టికెట్ల బుకింగ్ ప్రక్రియలో అంతరాయం నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కృష్ణమ్మ శ్రీశైలం వైపు అడుగులు వేస్తోంది. జూరాల ప్రాజెక్టు ఎగువన కర్ణాటకలోని ఆలమట్ట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి.
శ్రీశైలం మల్లన్న స్పర్శ (బ్రేక్) దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. వారాంతపు సెలవులు కావడంతో క్షేత్రానికి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిందని పేర్కొన్నారు.
గ్రామాల్లోని పురాతన ఆలయాల అభివృద్ధికి ఆయా గ్రామాల్లోని దాతలు సహకరించాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
మండలంలోని సున్నిపెంట గ్రామంలో గత కొంత కాలంగా 10 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేందుకు క్వాలిటీ కంట్రోల్ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.