Rekha Gupta: ఏబీవీపీ నాయకురాలు నుంచి ఢిల్లీ సీఎం వరకు.. రేఖాగుప్తా ప్రస్థానమిదే
ABN, Publish Date - Feb 19 , 2025 | 09:52 PM
Rekha Gupta: చిన్న నాటి నుంచి రేఖ గుప్తా ఆర్ఎస్ఎస్ భావజాలం పుణికిపుచ్చుకున్నారు. అలా స్టూడెంట్ యూనియన్ నేతగా, పితంపురా కార్పొరేటర్గా.. చివరికి షాలిమర్ బాగ్ ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఢిల్లీ పీఠాన్ని అధిష్టించనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం.. రేఖాగుప్తాను వరించింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. మరికొద్ది గంటల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనుంది. అయితే ఆమె విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి వచ్చి.. ఓ రాష్ట్రంలోని అత్యున్నత పీఠాన్ని అధిరోహించనున్నారు. ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైందంటే.. ఆమె జీవితం సామాజిక సేవ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు.
1992లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దౌలత్ రామ్ కళాశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ద్వారా ఆమె.. తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.1996 - 97లో ఆమె ఢిల్లీ విశ్వ విద్యాలయ విద్యార్థి సంఘం (DUSU) అధ్యక్షురాలైయ్యారు. ఆ సమయంలో విద్యార్థుల సమస్యలను ఆమె లేవదీసి.. పరిష్కరించేలా చర్యలు తీసుకొనే వారు. 2007లో ఉత్తర పితంపురా నుంచి తొలిసారి కౌన్సిలర్గా రేఖా గుప్తా ఎన్నికయ్యారు.
అనంతరం ఆ ప్రాంతంలో ప్రాథమిక సౌకర్యాలు.. లైబ్రరీలు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటుతోపాటు పచ్చదనానికి ఊతం ఇచ్చే కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు, పిల్లల సంక్షేమం కోసం "సుమేధ యోజన" వంటి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఇది ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి తొడ్పాటును అందించింది.
మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలిగా.. మహిళా సాధికారత ప్రచారానికి నాయకత్వం వహించారు. అలాగే ఢిల్లీలలోని బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పని చేయడమే కాకుండా.. ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలిగా సైతం పని చేశారు. ఆ క్రమంలో అణగారిన వర్గాలు, మహిళల సంక్షేమం కోసం అనేక ప్రచారాలను చేపట్టారు. ఆమె అంకితభావంతోపాటు సామాజిక లక్ష్యాల కోసం చేసిన కృషి.. ఆమె నాయకత్వ పటిమను మెరుగు పరిచింది.
Also Read: ఆ నియోజకవర్గం నుంచే బీజేపీ సీఎంలు
రేఖా గుప్తా జననం..
హర్యానాలోని జులానాలో 1974, జులై 19న ఆమె జన్మించింది. చిన్ననాటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) భావజాలంచే ప్రభావితురాలైంది. 1998లో మనీష్ గుప్తాను వివాహం చేసుకున్నారు. రేఖా గుప్తా జీవిత ప్రస్థానంలో ఆమె భర్త మనీష్ గుప్తా కీలకంగా వ్యవహరించారు. రేఖా గుప్తా తన కెరీర్లో సమాజానికి సేవ చేయడం పట్ల నిబద్దతను ప్రదర్శించారు. అదే మెను ఢిల్లీ రాజకీయ రంగంలో కీలక వ్యక్తిగా మార్చింది.
Also Read :టెక్నాలజీ అభివృద్ధి చెందినా.. ఏఐ వచ్చినా.. మనల్ని నడిపేది దేవుడే
రేఖ జీవితంలో కీలక ఘట్టాలు
1994-95 లో దౌలత్ రామ్ కళాశాల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
1995-96లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU) కార్యదర్శి అయ్యారు.
1996-97లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
2003-2004 వరకు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు.
2004-2006లో ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన బిజెపి యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పని చేశారు.
2007, ఏప్రిల్లో ఢిల్లీలోని ఉత్తరి పితంపుర కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. అనంతరం బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పని చేశారు.
Also Read: సీన్ రీ కన్స్ట్రక్ట్ అవసరం లేదు.. ఎందుకంటే..?
Also Read: వాయిదా పడ్డ ఎమ్మెల్యేల శిక్షణ తరగతులు.. ఎందుకంటే..?
మున్సిపల్ కార్పొరేటర్గా 2007-2009 వరకు వరుసగా రెండు ఏళ్లపాటు మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీ చైర్ పర్సన్ బాధ్యత ఆమెకు అప్పగించారు.
ఢిల్లీ రాష్ట్ర మహిళా మోర్చా బిజెపి-2009 ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఇక 2010, మార్చిలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఆమెకు పార్టీ గౌరవం కల్పించింది.
ఢిల్లీ విశ్వ విద్యాలయ విద్యార్థి సంఘం (డీయూఎస్యూ) కార్యదర్శిగా పనిచేస్తూ..
తొలిసారి “కామన్ అడ్మిషన్ ఫారం” ను ప్రారంభించారు. దీని ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు.
లైంగిక వేధింపుల నిరోధక కమిటీతోపాటు విద్యార్థినులపై వేధింపులు, ఈవ్ టీజింగ్ను ఆపడం, క్యాంపస్లో నేరాలను తనిఖీ చేయడానికి కాంపాక్ట్ క్యాంపస్ కమిటీని ఆమె ఏర్పాటు చేశారు.
Also Read: కొలిక్కి వస్తోన్న మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దగ్ధం కేసు
విద్యార్థుల కోసం "యు-స్పెషల్ బస్సుల" కొరత నేపథ్యంలో ఆమె సారథ్యంలో DUSU, JNU (స్టూడెంట్ యూనియన్), జామియామిలియా ఇస్లామియా స్టూడెంట్స్ యూనియన్, లాల్ బహదూర్ శాస్త్రి విద్యా పీఠ్ స్టూడెంట్ యూనియన్ మరియు TIBIA మెడికల్ కాలేజ్ స్టూడెంట్ యూనియన్ తదితర ఐదు ప్రధాన విద్యార్థి సంఘాలను ఒకే తాటిపైకి ఆమె తీసుకు వచ్చింది. ప్రైవేట్ ట్యూషన్లకు బదులు లెక్చరర్లు రెగ్యులర్ తరగతులు తీసుకునేలా ఆమె ప్రోత్సహించింది.
Also Read: ఏదో తేడాగా ఉంది
Also Read: జగన్కు దమ్ము లేదు
కౌన్సిలర్గా ఆమె సాధించిన విజయాలు
పితంపురాలో పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తూ, ఆమె ఒక సమగ్ర భూగర్భ పార్కింగ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేస్తోంది.
ప్రతి బ్లాక్లో కనీసం 1 అభివృద్ధి చెందిన పార్కును నిర్మించాలనే ఆమె నిబద్ధతను అనుసరించి, ఆమె రామాయణ పాత్ర పేరు మీద అనేక పార్కులను అభివృద్ధి చేసింది.
మొదటిసారిగా.. ఆమె పితంపుర - సీతా వాటిక (QU బ్లాక్)లో మహిళా పార్కును అభివృద్ధి చేసింది.
మొదటిసారిగా.. హైదర్పూర్ ప్రాంతంలో కౌన్సిలర్ పరిపాలనా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇది మెజార్టీ మురికివాడల్లో నివసించే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. తొలిసారి.. హైదర్పూర్ ప్రాంతంలో అనేక వీధి దీపాలు ఏర్పాటు చేశారు.
700 కంటే ఎక్కువ మంది వ్యక్తులకు పేదలు/వృద్ధులు/వితంతువులు/ఆధారపడిన వారికి క్రమం తప్పకుండా పెన్షన్లు పంపిణీ చేయించేవారు.
ఈ ప్రాంతంలో వీధులు, రోడ్లు, మరమ్మతులు చేసిన సిమెంట్ వీధులు, సర్వీస్ లేన్లు, పాదచారులు మొదలైన వాటి పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం.
మహిళలపై లైంగిక వేధింపులపై ఫిర్యాదుల కోసం ఆమె హెల్ప్లైన్ను ప్రారంభించింది.
సమాజంలో నిర్లక్ష్యం చేయబడిన వ్యక్తులతో నిరంతరం పనిచేయడం ద్వారా వారికి వ్యక్తిత్వ భావనతోపాటు సామాజిక వ్యత్యాసాలలో సన్నిహితత్వాన్ని అందించడం.
ఢిల్లీ సీలింగ్ చట్టం కారణంగా అనేక మంది దుకాణదారులు, ఫ్యాక్టరీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం
భారీ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఆందోళనలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ఇతర పార్టీ సభ్యులతో నిరంతరం పనిచేయడం.
పితాంపుర ప్రాంతంలో ప్రతిరోజూ ఇంటింటికి చెత్తను సేకరించడానికి అనేక పర్యావరణ అనుకూల (బ్యాటరీతో పనిచేసే) చెత్త ట్రక్కులను కేటాయించారు.
For National News And Telugu News
Updated Date - Feb 19 , 2025 | 10:00 PM