Home » National News
స్వల్పశ్రేణి లక్ష్యాలను ఛేదించే అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణ పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని చాందీపూర్లోనున్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వ్యూహాత్మక దళాల కమాండ్ (ఎస్ఎఫ్సీ) ఆధ్యర్వంలో శుక్రవారంనాడు ఈ క్షిపణ పరీక్ష జరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఉత్తరప్రదేశ్లో 'ఇండియా' బ్లాక్ యథాతథంగా ఉంటుందని, కాంగ్రెస్తో తమ పొత్తు కొనసాగుతుందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ధ్రువీకరించారు. అయితే సీట్ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్కు గెలిచే సీట్లే ఇస్తామనే సంకేతాలను ఆ పార్టీ పంపింది.
ఎవరెస్ట్ పర్వత శిఖరంపై విషాదం చోటుసేసుకుంది. పర్వతారోహణ ముగించుకుని కిందకు దిగివస్తుండగా ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్టు నేపాల్ అధికారులు ప్రకటించారు. మృతులను అరుణ్కుమార్ తివారీ, సందీప్ అరేగా గుర్తించారు.
దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ చట్టాలపై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దక్షిణ భారతదేశంలోని హిందూ దేవాలయాలను ప్రభుత్వాలు తమ అధీనంలో ఉంచుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కీలక పిటిషన్ల విచారణకు అత్యన్నత న్యాయస్థానం శుక్రవారంనాడు అంగీకరించింది.
తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం శుక్రవారంనాడు మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిపింది. ప్రభుత్వంలో మరో ఇద్దరికి చోటు కల్పించింది. టీవీకేకు బయట నుంచి మద్దతిస్తామని ఇంతకుమందు ప్రకటించిన విడుదలై చిరుతైగళ్ కట్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధికార కూటమిలో చేరాయి.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) విదేశీ శక్తుల కుట్రంటూ భారత భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో నిరుద్యోగ యువత అసంతృప్తిని ఆసరాగా చేసుకుని అశాంతిని సృష్టించేందుకు వ్యూహం పన్నారనే కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సరిహద్దు చొరబాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలిపారు. ఇందుకోసం జీరో టాలరెన్స్ పాలసీని అనుసరించనున్నామనీ, దేశ సరిహద్దులను మూసివేసేందుకు ఏడాదిలోగా సమగ్ర 'స్మార్ట్ బోర్డర్' పాలసీని తీసుకురానున్నామని చెప్పారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషల బోధనను తప్పనిసరి చేస్తూ తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ఇప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
డబ్బు కోసం భారత దేశ రహస్యాలను పాకిస్థాన్కు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్లోని తన హ్యాండ్లర్లతో పంచుకున్న ఒక నెట్వర్క్ బండారాన్ని పోలీసులు బయటపెట్టారు.