Home » National News
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటీవల బీజీపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు కేంద్ర హోం శాఖ 'ఎక్స్' కేటగిరీ భద్రత కల్పించింది. ఇందులో భాగంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందిని ఆయన భద్రత కోసం కేటాయించింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ సోమవారంనాడు తోసిపుచ్చారు.
బారామతి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు దివంగత అజిత్ పవార్ భార్య, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సునేత్ర పవార్ సోమవారంనాడు నామినేషన్ వేశారు.
ఈసారి యుద్ధం అంటూ జరిగితే కోల్కతాపై దాడి చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరిని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ తప్పుపట్టారు. మోదీ మౌనాన్ని పశ్నించారు. తక్షణం ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ వద్ద సోమవారంనాడు కీలకమైన భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్తో ఉన్న ఒక వాహనం బలవంతంగా అసెంబ్లీ ఆవరణలోకి అడుగుపెట్టినట్టు అధికారులు తెలిపారు.
దేశ రాజధాని సహా పలు రాష్ట్రాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్లోని పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పుదుచ్చేరిలోని ప్రాంతీయ నాయకులను బీజేపీ పక్కనపెట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా పాలన సాగిస్తోందని విమర్శించారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని ప్రజలను కోరారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ భార్య మూడు విదేశీ పాస్పోర్టులు కలిగి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు తీవ్ర ఆరోపణలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టంచాయి. అయితే ఈ ఆరోపణలను హిమంత బిశ్వా శర్మ తోసిపుచ్చారు.