Home » National News
8వ వేతన సంఘం సిఫారసుల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరు కేటుగాళ్లు.. తప్పుడు ప్రచారానికి తెర లేపారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు డీఏ పెంపు సహా ఇతర ప్రయోజనాలు అందవని ప్రచారం చేస్తున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంత నిజముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
మన దేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కానీ, కాలం గడిచే కొద్ది ఆ వివాహ బంధానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు. క్షణకాల ఆనందం కోసం.. కాపురాలను పాడు చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
పార్టీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నబీన్ మాట్లాడుతూ, పార్టీని మరింత పటిష్టం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్షా, రాజ్నాథ్ సింగ్, తనపై నమ్మకం ఉంచిన పార్లమెంటరీ పార్టీకి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
హహల్గాం దాడిలో పాకిస్థాన్ కుట్ర, నిందితుల పాత్ర, వాటిని బలపరచే సాక్ష్యాలను ఛార్జిషీటులో ఎన్ఐఏ చేర్చింది. నిషేధిత ఎల్ఈటీ/టీఆర్ఎఫ్ సంస్థ ఈ కుట్రకు ప్రణాళిక రచించి దాన్ని అమలు చేసినట్టు తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అంశంపై తమ వాదనను ఉధృతం చేస్తూ న్యూఢిల్లీలో ఆదివారంనాడు మెగా ర్యాలీ నిర్వహించింది. ఓటింగ్ ప్రక్రియను తారుమారు చేసేందుకు బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ, ఈసీ ఖండించాయి.
జేపీ నడ్డా 2019 జూన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. అమిత్షా కేంద్ర మంత్రి అయ్యేంత వరకూ ఆరు నెలల పాటు ఆయనకు జేపీ నడ్డా సహాయకుడిగా వ్యవహరించారు. ఆ తరువాత 2020 జనవరిలో జేపీ నడ్డా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
పశ్చిమబెంగాల్లో ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సి పర్యటన సందర్భంగా కోల్కతా స్టేడియనంలో అభిమానులు విధ్వంసం సృష్టించడంతో బీజేపీ టీఎంసీపై విమర్శలు గుప్పించింది.
అయోధ్యలో రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వేదాంతి కీలక భూమిక పోషించారు. పలు ర్యాలీలు, కార్యక్రమాలతో ప్రజామద్దతును కూడగట్టారు.
ఢాకాలోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు పంపడం, భారత భూభాగం నుంచి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎంఈఏ తాజాగా స్పందించింది.