Home » Assembly elections
తమిళనాడులో ఎన్నికల అనంతరం ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి టి.టి.వి. దినకరన్ తన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఎస్. కామరాజ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
విజయ్కు చెందిన TVK పార్టీకి మద్దతు ఇవ్వాలా.. వద్దా అనే అంశంపై చర్చించడానికి విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) తన ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే దానిపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆ పార్టీ అధినేత విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భగా ఆ రాష్ట్ర గవర్నర్ అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ స్పందించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీవీకే పార్టీకి పట్టం కట్టారని, అయినాకాని, విజయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, అదే న్యాయమని చెప్పారు.
పశ్చిమ బెంగాల్లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీంతో భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తుంది.
నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని 'చరిత్రాత్మకమైనది, నిర్ణయాత్మకమైనది' అని అభివర్ణిస్తూ వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో BJP విజయాన్ని AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితం మాత్రమే కాదని, దేశ భవిష్యత్తుపై దీని ప్రభావం ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ అధికారానికి చేరువైన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఇచ్చిన హామీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
కేరళంలో పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ ఓటమిని చవిచూసినప్పటికీ ధర్మాదం నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం మూడోసారి. అయితే గత రెండు పర్యాయాల్లో ఆయన సాధించిన ఆధిక్యం కంటే ఈసారి తగ్గింది.
దేశంలో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలూ వెలువడ్డాయి.