ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Operation Sindoor: అందుకే.. ఆపరేషన్ సిందూర్‌.. త్రివిధ దళాల రియాక్షన్ ఇదే..

ABN, First Publish Date - 2025-05-07T11:07:42+05:30

పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై భారత త్రివిధ దళాల అధికారులు స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ గతంలో పార్లమెంట్‌పై దాడి నుంచి తాజాగా జరిగిన పహల్గామ్ దాడి వరకూ మొత్తం 350 మంది పౌరులు మృతి చెందారని చెప్పారు.

ఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై భారత త్రివిధ దళాల అధికారులు స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ గతంలో పార్లమెంట్‌పై దాడి నుంచి తాజాగా జరిగిన పహల్గామ్ దాడి వరకూ మొత్తం 350 మంది పౌరులు మృతి చెందారని చెప్పారు. అలాగే 600 మందికి పైగా సైనికులు మృతిచెందారన్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకే ఆపరేషన్ సిందూర్‌ చేపట్టినట్లు తెలిపారు. పహల్గామ్‌లో పౌరులను విచక్షణారహితంగా కాల్చి చంపారని, ఈ దాడిలో 25 మంది భారతీయ పౌరులు, ఒక నేపాలీ మృతిచెందారని చెప్పారు. పహల్గామ్‌ దాడి అత్యంత హేయమైనదని తెలిపారు. ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి అని, జమ్మూకశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగమని చెప్పారు.


ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఐరాస విఫలమైందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. TRF అనేది లష్కరే తొయిబాకు ఒక ముసుగు వంటిదన్నారు. ఉగ్రసంస్థల కోసమే TRF పనిచేస్తోందన్నారు. నిఘా వ్యవస్థల ద్వారా ఉగ్రదాడులకు పాల్పడ్డవారిని గుర్తించామని చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలను పాక్ తప్పుదారి పట్టిస్తోందని, ఉగ్రవాదానికి పాకిస్థాన్ స్వర్గధామంగా మారిందని దుయ్యబట్టారు. భారత్‌పై రానున్న రోజుల్లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని.. నిఘా వర్గాలు హెచ్చరించాయన్నారు. ఉగ్రసంస్థల మౌలిక వసతులు ధ్వంసం చేసేందుకే సరిహద్దు దాటి భారత్ దాడి చేసిందని స్పష్టం చేశారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని తెలిపారు. పహల్గామ్ దాడిలో మరో కుట్ర కూడా ఉందని, కశ్మీర్‌తో పాటూ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారని తెలిపారు.


కశ్మీర్‌ను గతేడాది 2.3కోట్ల మంది పర్యాటకులు సందర్శించారని రక్షణశాఖ అధికారులు తెలిపారు. జమ్మూకశ్మీర్ పర్యాటకంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పహల్గామ్ దాడితో ఇదంతా దెబ్బతీయాలని చూశారని చెప్పారు. అందుకే ఉగ్రవాదులకు సరైనరీతిలో బుద్ధి చెప్పామని వివరించారు. పాక్‌లో ఉగ్రసంస్థలు ఉన్నాయని 2023లోనే ఐరాస దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉందన్నారు. ఇక ముందు కూడా ఉగ్రచర్యలను భారత్ ఉపేక్షించదని, దాడులకు పాల్పడేవారిని కచ్చితంగా శిక్షిస్తామన్నారు. పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసిందని, భారత్ చేసిన దాడి బాధ్యతాయుతమైనదంటూ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.

Updated Date - 2025-05-07T13:57:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising