Home » Indian Army
భారత వాయుసేనను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ భారీగా విమానాలను కొనుగోలు చేయనుంది. 60 రవాణా విమానాలు, 150 శిక్షణ విమానాలను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది.
దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే ఓ ఆర్మీ జవాన్ స్వగ్రామానికి వస్తూ అదృశ్యమవడం కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని తోటల చెరువుపల్లికి చెందిన పగడాల రవి 19 రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ప్రియురాలి కోసం భారత్లోకి చొరబడ్డ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన 22 ఏళ్ల యువకుడిని భారత్ ఆర్మీ సొంత దేశానికి పంపేసింది. భారత ఆర్మీ అధికారులు శనివారం ఆ యువకుడిని పాకిస్థాన్ ఆర్మీ అధికారులకు అప్పగించారు.
భారత సైన్యానికి నూతన అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించారు. దేశ 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో.. కొత్త ఆర్మీ చీఫ్ కమాండ్ చేపట్టారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగం చేసిన ఆరుగురు సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ను తదుపరి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నియమిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
లద్దాఖ్లోని పర్వత ప్రాంతాల్లో ఓ హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు భారత సైనికాధికారులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే.. ఈ ఘటన అనంతరం ఆర్మీ అధికారి తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
డబ్బు కోసం భారత దేశ రహస్యాలను పాకిస్థాన్కు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్లోని తన హ్యాండ్లర్లతో పంచుకున్న ఒక నెట్వర్క్ బండారాన్ని పోలీసులు బయటపెట్టారు.
భారతదేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. 30 మే 2026తో ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలం ముగియనుంది.
ఆపరేషన్ సిందూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ఫోర్స్ సోషల్ మీడియా ఖాతాల్లో గురువారం ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేశాయి.