Home » Indian Army
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లో జరిగిన పౌర రక్షణ వలంటీర్ల శిక్షణా శిబిరంలో ఉప ముఖ్యమంత్రి జగదీశ్ దేవ్డా మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రవాదులకు మోదీ దీటుగా జవాబిచ్చారని ప్రశంసించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ తీసుకున్న నిర్ణయానికి యావద్దేశంతోపాటు, మిలటరీ మొత్తం ఆయన పాదాలకు మొక్కాలని అన్నారు.
విజయవాడలో భారత సైనికులకు మద్దతుగా శుక్రవారం నాడు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కూటమి నేతలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.
ఇండియన్ ఆర్మీలో యువతకు అదిరిపోయే జాబ్ ఆఫర్స్ వచ్చేశాయి. 12వ తరగతి తర్వాత నేరుగా ఆర్మీ ఆఫీసర్లు కావాలనుకునే యువతకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ పోస్టులకు ఏకంగా రెండు లక్షల వరకు శాలరీ ఉండటం విశేషం.
Pawan Kalyan: భారత్కు రక్షణ కవచంలా నిలిచిన మన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి, మన రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
జమ్మూ కశ్మీర్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. నిఘా వర్గాల సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని, 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు ఫోర్స్ మేజర్ జనరల్ ధనంజయ్ జోషి తెలిపారు.
Minister Vijay Shah: కల్నల్ సోఫియా ఖురేషీ వివాదంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సారీ చెప్పాల్సిందే అంటూ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలేం జరిగిందంటే..
Pahalgam Attack: పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఉగ్రవాదులతో పాటు వాళ్లకు అండగా ఉంటున్న పాకిస్థాన్ను వణికించింది ఇండియన్ ఆర్మీ. అయితే ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది.
Janasena Special Pujalu: భారత సైన్యానికి తోడుగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఆధ్వర్యంలో మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు పాల్గొన్నారు.
India- Pakistan War: పాకిస్తాన్, భారతదేశాల మధ్య సోమవారం నాడు కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ చర్చల్లో పలు అంశాలను రెండు దేశాలు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఈ చర్చలు రెండు దేశాలకు ఎంతో ప్రాధాన్యం కానున్నాయి.
IAF: కాల్పుల విరమణకు ఇటు భారత్, అటు పాకిస్థాన్ ఒప్పుకోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముగిశాయని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ టైమ్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది భారత వాయుసేన. ఆపరేషన్ సిందూర్పై సంచలన ప్రకటన చేసింది ఐఏఎఫ్.