Pakistan: రెచ్చిపోయిన తిరుగుబాటుదారులు.. తొమ్మిది మంది సైనికులు మృతి
ABN, Publish Date - Aug 12 , 2025 | 09:57 PM
పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్లో సాయుధ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 12: పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్లో సాయుధ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్తోపాటు ప్రాంటియర్ కార్ఫ్స్ కాంపౌండ్పై దాడి ముకుమ్మడి దాడికి దిగారు. ఈ దాడిలో తొమ్మిది మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు.
భద్రతా దళాలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి చేసినట్లు వాషుక్ జిల్లాకు చెందిన సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ దాడిలో తొమ్మిది మంది సైనికులు అక్కడికక్కడే మరణించారని చెప్పారు. ఇటీవల కాలంలో జరిగిన అత్యంత దారుణమైన దాడిగా దీనిని ఆయన అభివర్ణించారు.
ఇటీవల మస్తుంగ్ జిల్లాలో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకున్నారు. అందులో భాగంగా ఈ రైలు వెళ్తున్న సమయంలో ట్రాక్పై ఐఈడీ అమర్చి.. పేల్చారు. ఈ ఘటనలో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ పేలుడు ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడిన విషయం విదితమే. ఈ రైలు పెషావర్ వెళ్తుండగా ఈ పేలుడు సంభవించింది.
పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో హింసాత్మక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల కరాచీ నుంచి క్వెట్టాకు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే కిల్లా అబ్దుల్లా జిల్లాలోని మార్కెట్పై బాంబు దాడి చేశారు. ఈ పేలుడులో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బాంబు పేలుడు దాటికి మార్కెట్ సమీపంలోని పలు దుకాణాలు కుప్ప కూలిపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సృష్టిలో మరో దారుణం.. ఇలా వెలుగులోకి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
For More International News And Telugu News
Updated Date - Aug 12 , 2025 | 10:02 PM