Home » International News
నైజీరియాలోని ఓ గనిలో విషవాయువులు లీకయ్యాయి. ఆ విష వాయువులను పీల్చి 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నార్త్ సెంట్రల్ నైజీరియాలోని ఓ గనిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న హనుమాన్ విగ్రహంపై ‘మాగా’ మద్దతుదారుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఈ విగ్రహం అమెరికాపై భారతీయ వలసదారుల దాడికి గుర్తని అభివర్ణిస్తూ చేసిన పోస్ట్ పై తీవ్ర దుమారం రేగుతోంది.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ డౌన్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై యూట్యూబ్ యాజమాన్యం స్పందించింది. వివరాల్లోకి వెళితే..
శ్రీలంక ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో మంగళవారం ఆమోదించబడింది. అయితే, ఈ ప్రతిపాదనను కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. వివరాల్లోకి వెళితే..
బంగ్లాదేశ్ తాత్కాలిక సారథిగా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన మహమ్మద్ యూనస్ చివరి ప్రసంగంలో కూడా భారత్పై అక్కసు వెళ్లగక్కారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బీఎన్పీ నేత తారిఖ్ రెహ్మాన్ బంగ్లా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బంగ్లేదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిఖ్ రెహమాన్ మంగళవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ పార్లమెంట్ బిల్డింగ్ సౌత్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌకను కరేబియన్ సముద్రం నుంచి మధ్యప్రాచ్యానికి అమెరికా తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొద్ది వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్లో చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కలుసుకోనున్నారు. ఈ విషయాన్ని మీడియాకు ట్రంప్ తెలిపారు.
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) సత్తా చాటుతోంది. 17 సంవత్సరాల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోనీ బీఎన్పీ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తారిక్ రెహ్మాన్ పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు.
2023లో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న పోలీసు కారు ఢీకొని మరణించిన భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత జాహ్నవి కందులకు న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళితే..