Home » International News
స్కాట్లాండ్ రాజకీయ నాయకుడు మార్టిన్ డే, కేరళకు చెందిన నిధిన్ చంద్ ప్రేమకథ చివరకు పెళ్లితో సుఖాంతమైంది. పదేళ్ల నిరీక్షణ అనంతరం నిధిన్ కోరుకున్నట్టుగానే త్రిశూర్లోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో వీరిద్దరూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఇటీవల చైనాలో విడుదలైన ఓ యానిమేషన్ సినిమా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఒక సినిమా హిట్ కావాలంటే గొప్ప కథ, అద్భుతమైన విజువల్స్, కోట్ల బడ్జెట్, వీటన్నింటికీ మించి భారీ ప్రచారం ఉండాలి. కానీ, ఈ సినిమాకు ట్రోల్స్ అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ ఎన్నికల విధానాన్ని ప్రస్తావించారు. అమెరికాలో ఓటర్ల గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలని కోరుతూ, భారత్లో అమలవుతున్న ఓటర్ గుర్తింపు విధానాన్ని ఉదాహరణగా చూపించారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఇండోనేషియాను వరుస భూ ప్రకంపనలు కుదిపేస్తున్నాయి. ఆగస్టు 15న సంభవించిన భారీ భూకంపంతో సుమారు 59 మంది మృతిచెందగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రెండ్రోజుల వ్యవధిలోనే మరోసారి నేడు ప్రకంపనలు సంభవించడంతో ఇండోనేషియా ప్రజలు బెంబేలెత్తిపోయారు.
ఇరాన్ అణు కార్యక్రమంపై సంచలన సమాచారం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ తప్పుడు పోస్టు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఆ పోస్టులోని తప్పుడు సమాచారాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు.
సాధారణంగా మురుగు కాలువ పనులు చేస్తుండగా మట్టి, రాళ్లు బయటపడటం సహజం. కానీ బెల్జియంలో ఓ 18 ఏళ్ల యువకుడికి మాత్రం ఏకంగా కోట్ల విలువైన బంగారు నిధి దొరికింది. డ్రైనేజీ పైపుల కోసం తవ్వకాలు చేపడుతుండగా అతడికి బంగారు నాణేలు, బంగారు కడ్డీలు కనిపించాయి.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సైనికుడిని పట్టుకున్నా లేదా చంపినా 30 వేల డాలర్లు (దాదాపు రూ.29 లక్షలు) బహుమతిగా ఇస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించింది.
భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిత్తల్కు చెందిన ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ స్వస్థలమైన క్రైవీ రిహ్లో ఉన్న ఈ భారీ పారిశ్రామిక సముదాయంపై ఆదివారం రాత్రి రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది.