ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశి.. ఆ రోజు ఇలా చేస్తే..

ABN, Publish Date - Dec 28 , 2025 | 10:15 AM

వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలంటే..

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అన్ని పవిత్రమైనవే. కానీ ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ ఏడాది ఈ ముక్కోటి ఏకాదశి.. డిసెంబర్ 30వ తేదీ మంగళవారం వచ్చింది. ఈ రోజున వైకుంఠం ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతాయి. అందుకు వైష్ణవ ఆలయాల్లోని ఉత్తర ద్వారం ద్వారా దేవ దేవుళ్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. ఈ వైకుంఠ ఏకాదశికి మహా విశిష్టత ఉంది.

ఈ రోజున..

వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అంటారు అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు. అంతేకాదు.. ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమని అంటారు. క్షీరసాగర మథనం జరిగి హాలాహలంతోపాటు అమృతం ఉద్భవించిందని ఈ రోజేనని పురాణాలు చెబుతాయి. అలాగే పెరియాళ్వార్‌కు శ్రీమహా విష్ణువు గరుడ వాహనంపై దర్శనమిచ్చిందని ఈ రోజనని పేర్కొంటారు.

ఈ రోజు ఆలయంలోకి ఉత్తరద్వారం ద్వారా వెళ్లి.. శ్రీమహావిష్ణువును దర్శించుకుంటే సమస్త పాపాలు పోవడమే కాకుండా జన్మరాహిత్యం సైతం లభిస్తుందంటారు. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి వారి ఆలయంలో 21 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే తిరుమలలో ముక్కోటి ఏకాదశి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి)లో సైతం వైకుంఠ ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈ ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువుకు ప్రతి రూపమైన శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుపతి, చిన్న తిరుపతికి తరలివస్తారు. అలాగే ఈ మాసంలో తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరంగనాథ స్వామి వారి దేవాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు సైతం ఈ దేవాలయాలకు భక్తులు భారీగా తరలి రానున్నారు. ముక్కోటి ఏకాదశి ప్రాశస్తాన్ని వివరించేందుకు పురాణాల్లో చాలా కథనాలే ఉన్నాయి. ఈ కథలన్నీ వైకుంఠ ఏకాదశి విశిష్టతను వివరిస్తాయి.

ఈ రోజు చేయాల్సినవి.. చేయకూడనివి..

తులసి ఆకులు..

శ్రీమహావిష్ణువుకు తులసి అంటే అత్యంత ప్రీతికరం. ఈ రోజు తులసి ఆకులు కోయడం మంచిది కాదు. ఈ రోజు ఆ నారాయణుడికి తులసిని సమర్పించాలి. ముక్కోటి ఏకాదశి ముందు రోజే తులసి ఆకులు కోసి.. పూజకు సిద్ధం చేసుకోవాలి. ఈ రోజు తులసి మొక్కు ముట్టుకోవడం మహా పాపమంటారు.

వీటిని తినవద్దు..

ఈ రోజు.. అన్నం, బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు తిన వద్దంటారు.

మాంసాహారంతోపాటు..

ఈ రోజు మాంసాహారంతోపాటు ఉల్లి, వెల్లుల్లి తీసుకోకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

వీటికి దూరంగా..

ఈ రోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఎవరి బాధ పెట్టడం కానీ.. దూషించడం కానీ చేయకూడదు. ఎవరితో ఘర్షణ పడడం అంత మంచిది కాదు.

ఇలా చేయాలి..

ఈ రోజు హరినామ స్మరణ చేయాలి. పగలు నిద్రపోవడం మంచిది కాదు. రాత్రి అంతా జాగరణ చేస్తే పుణ్యం కలుగుతుందంటారు.

ఈ రోజు.. ఇలా చేయండి..

ఈ రోజు అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. పేదలకు, లేనివారికి తూచిన వాటిని దానంగా ఇస్తే పుణ్యం కలుగుతుంది.

ఉపవాసం, జాగరణ..

ఈ రోజు శ్రీమహావిష్ణువును స్తుతిస్తే మోక్షం లభిస్తోంది. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. ఈ రోజు ఉపవాసం ఉండి.. ద్వాదశి రోజు అతిథి లేకుండా భోజనం చేయకూడదని చెబుతారు. ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే పాప విముక్తులు అవుతారని పురాణాలు సైతం చెబుతున్నాయి.

ఈ మంత్రాన్ని జపిస్తే..

ఈ రోజు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది. ఈ రోజు ఈ నామాన్ని జపించడం వల్ల అనుకున్న కార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని నమ్ముతారు. అలాగే గీతా పారాయణం, గోవింద నామస్మరణ చేస్తే విశేష ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రోజు గోసేవ, పురాణ శ్రవణం, దానధర్మాలు వంటివి చేయడం వల్ల మోక్లం కలుగుతుందంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరిస్తే.. జ్ఞానవంతులు అవుతారంటారు.

లక్ష్మీ కటాక్షం కలగాలంటే..?

తులసి మొక్క, కప్పుకునే దుప్పటి, ధాన్యం తదితర వస్తువులు పేదలకు దానంగా ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆహారం, దుస్తులు, ఆర్థిక సహాయం సైతం ఇవ్వవచ్చు. తద్వారా శ్రీమహాలక్ష్మీ, విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. గోవును దానంగా ఇస్తే.. అంతా మంచి జరుగుతుందని చెబుతారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పుష్యమాసంలో ఇలా చేస్తే కష్టాలు తొలుగుతాయి..!

వచ్చే ఏడాది ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమేనట..!

For More Devotional News And Telugu News

Updated Date - Dec 28 , 2025 | 10:19 AM