Tirupati News: దేవుడా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందో తెలిస్తే...
ABN, Publish Date - Dec 09 , 2025 | 12:42 PM
ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతిచెందిన విషాద సంఘటన తిరుపతి జిల్లా వాకాడు మండలంలో చోటుచేసుకుంది. ఈశ్వరయ్య అనే యుకుడు మహాలక్ష్మమ్మ దేవాలయం పక్కన ఉన్న గుంటలో ఈత కొట్టేందుకు దిగాడు. అక్కడే నీటిలో మునిగి మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.
- ఈతకెళ్లి యువకుడి మృతి
వాకాడు(తిరుపతి): ఈతకెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృతిచెందిన ఘటన మండలంలోని గొల్లపాళెం(Gollapalem)లో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గొల్లపాళెం గ్రామానికి చెందిన విన్నమాల ఈశ్వరయ్య(27) సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో మహాలక్ష్మమ్మ దేవాలయం పక్కన ఉన్న గుంటలో ఈత కొట్టేందుకు దిగాడు. బయటకు రాకపోవడంతో స్థానికులు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని బాలిరెడ్డిపాళెం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 09 , 2025 | 12:42 PM