ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..

ABN, Publish Date - Jun 15 , 2025 | 05:37 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలను చర్చించారు.

AP CM Chandrababu with Central Minister Piyush Goyal

అమరావతి, జూన్ 15: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ని సీఎం చంద్రబాబు భోజనానికి ఆహ్వానించారు. దీంతో వారిద్దరూ ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. అనంతరం లంచ్ మీటింగ్‌లో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

  • హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చించారు.

  • టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విన్నవించారు.

  • పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు.

  • బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు వివరించారు.

  • పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే రూ.300 కోట్లలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలంటూ కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

  • పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కోరారు.

  • ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంపై పునరాలోచన చేయాలని పీయూష్ గోయల్‌ను చంద్రబాబు కోరారు.

  • దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని.. తీవ్రంగా నష్టపోతారని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు.

  • దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం.. కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్‌ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకూ ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.

  • ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సీఎం చంద్రబాబు సూచించారు.

  • సీఫుడ్‌పై అమెరికా విధించిన 27 శాతం సుంకం ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతోందని సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు.

  • ఏపీ ఆక్వా రైతులపై ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రికి విన్నవించారు.

  • మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ని సీఎం చంద్రబాబు కోరారు.

  • ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు పీయూష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ

మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..

For Andhrapradesh News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 06:20 PM