PC Ghosh Commission: పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై.. హైకోర్ట్కు కేసీఆర్..
ABN, Publish Date - Aug 19 , 2025 | 09:49 PM
కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అందులో భాగంగానే కేసీఆర్, హరీష్రావు.. తెలంగాణ హైకోర్టున ఆశ్రయించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆరోపించారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అందులో భాగంగానే కేసీఆర్, హరీష్రావు.. తెలంగాణ హైకోర్టున ఆశ్రయించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ ప్రభుత్వం కమిషన్ వేసిందని ఆరోపించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విద్యుత్ కొనుగోళ్ల అంశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్పై కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి రిలీఫ్ పొందారు. కాగా, ఇప్పుడు కాళేశ్వర కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీష్.. హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Updated Date - Aug 19 , 2025 | 09:49 PM