Home » Kaleshwaram Project
కేసీఆర్ సభల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇచ్చారా..? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సచివాలయానికి వెళ్తే గేట్లకు తాళం వేసి అడ్డుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ఈఎన్సీ మురళీధర్ ఆస్తుల అటాచ్కి కూడా విజిలెన్స్కి ఇరిగేషన్ శాఖ లేఖ రాసింది. దీంతో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు మురళీధర్ ఆస్తుల విలువ రూ.100 కోట్లు పైనే అని తేల్చారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజిలను మరమత్తు చేయాలని నిర్ణయం తీసుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నారు.
ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాథమిక విచారణను సీబీఐ అధికారులు ప్రారంభించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మోదీ ప్రభుత్వానిది మెతక వైఖరి అని మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ను కాళేశ్వరం కేసు నుంచి తప్పించే అవకాశం ఉందని విమర్శించారు.
షాడో సీఎం ఆరోపణలపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. షాడో సీఎం ఎవరో ఆ వ్యక్తి పేరు, చేసిన పని ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎన్నో చూశానని సీఎం రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు.
మేడిగడ్డ టు మల్లన్న సాగర్ - మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 84,000 కోట్లు అయితే.. జస్ట్ తమ్మిడి హెట్టి టు ఎల్లంపల్లి కి రూ. 35,000 వేల కోట్లట! కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేది లక్ష్యం అయితే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు నీరట అంటూ హరీష్ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తాము పాల్పడమని, చట్ట ప్రకారమే అన్ని జరుగుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కమిటీల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని, ఒక్కో కమిటీ రిపోర్ట్ వచ్చాక దోషులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.