Home » Kaleshwaram Project
కాళేశ్వరం విషయంలో బిఆర్ఎస్ పార్టీ బూటకపు ప్రచారం చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కన్నెపల్లి పంపు హౌస్కు18 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. అన్నారం బ్యారేజ్కి రంధ్రాలు ఉన్నాయని CWPRS రిపోర్ట్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
హైడ్రాపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దగ్గర ఉన్న శాఖనని.. వారే దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
కేసీఆర్ హయాంలోని పదేళ్లలో ఇరిగేషన్పై లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
రక్తం ప్యాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్పై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే కాళేశ్వరం కుంగిపోయిందని తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు.
కాళేశ్వరం విషయంలో తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
కాళేశ్వరం విషయంలో డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, ప్రస్తుత పరిస్థితులు, ప్రాజెక్టు రీడిజైన్, నిర్మాణంలో అవినీతి వంటి అంశాలను ప్రజాభవన్ వేదికగా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి వెల్లడించారు.
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కట్టారని.. ఆ ప్రాజెక్టు పేరుతో నిధులు మెక్కారని ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరుతో ఆయన డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.