Home » KCR
కొండపోచమ్మసాగర్ జలాశయంలో మునిగి ఐదుగురు యువకులు మరణించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Minister Uttam Kumar Reddy: త్వరలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా ఒకటి రెండు హామీల అమలు ఆలస్యం అయిందని అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో శుక్రవారం ఏసీబీ విచారణ అనంతరం శనివారం ఆయన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో సమావేశమయ్యారు.
తెలంగాణ: ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula E car race) కేసు నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్(KCR)ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్రావులకు భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులపై మరోసారి ఊరట లభించింది. ఆ ఉత్తర్వులపై సస్పెన్షన్ను మరో రెండు వారాలు పొడిగిస్తూ హైకోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ వైఫల్యాలతోపాటు ఆర్థిక అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈనెల 22వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ను విచారించాలని యోచిస్తోంది.
Gutha Sukhender Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడం అభినందనీయమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సేద్యయోగ్యమైన భూములకే పెట్టుబడి సహాయం ఇవ్వాలని తాను కూడా సూచించానని అన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గుట్టలకు, రోడ్లకు రైతుబంధు తొలగించాలని ప్రభుత్వానికి సూచించామని అన్నారు.
రేవంత్ ప్రభుత్వం చేసిన అప్పులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు.
BANDI SANJAY: రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా టైం పాస్ చేసి మోసం చేసిందో అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రకటనలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు.
విద్యుత్తు ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపిన జస్టిస్ మద న్ బి.లోకూర్ కమిషన్ నివేదికను అడ్వకేట్ జనరల్(ఏజీ)కి పంపించి, న్యాయనిపుణుల సలహా మేరకు మాజీ సీఎం కేసీఆర్పై చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.