Home » KCR
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కథ ముగిసిందని.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతారని ఆరోపించారు.
Telangana: బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య వార్ ఏపాటితో అందరికీ తెలిసిందే. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసుకుంటూ దుమ్మెత్తిపోస్తుంటారు. తాజాగా జగదీష్రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఇంతకీ ఆయన ఏం అన్నారో ఇప్పుడు చూద్దాం. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్లో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మూడోసారి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై మరోసారి బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘనందనరావు (Raghanandana Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో భట్టి విక్రమార్క, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా..? ఆ ఇద్దరు నేతలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ తన విశ్వరూపం చూపించేదా..? రేవంత్ అంటే ఎందుకు అంత భయం.
రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం కష్టమేనని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukhendar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికలతో బీఆర్ఎస్(BRS) ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే ఉండిపోతుందని అన్నారు.
తెలంగాణ ప్రజలు పదేళ్లపాటు దొరల పాలన చూశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం నాడు మెదక్లో జరిగిన జనజాతర సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలపై రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సభలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
Telangana: ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు తోడు దొంగల పార్టీలని విమర్శించారు. కేసీఆర్ అహంకారంతో సహచర మంత్రులను, నాయకులను, ప్రజలని మర్చిపోయారని.. ఫలితంగా చిత్తుగా ఓడిపోయారని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే నష్టమే తప్ప, లాభం లేదని.. రాష్ట్రానికి ఒరిగేదేమి లేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ వికెట్లు ఒక్కొక్కటిగా పడిపోతున్నాయి. పార్టీలో ఇవాళ ఉన్నవారు.. రేపు ఉంటారనే నమ్మకం లేకుండా పోతోంది. నేడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరనున్నారు. ఒకట్రెండు రోజుల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేరికలపై ఫోకస్ పెట్టనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ (BRS) పార్టీ పని అయిపోయిందని.. .పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. శుక్రవారం నాడు సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికలపై కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలపై కీలక అంశాలపై చర్చించారు.