CM Revanth Reddy: మీడియాపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. ఆ లిస్టులో లేకుంటే అంతే..
ABN, First Publish Date - 2025-03-15T16:14:48+05:30
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ మీడియాపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడితే ఎవరినైనా గౌరవిస్తామని, అంతే కానీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ మీడియాపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడితే ఎవరినైనా గౌరవిస్తామని, అంతే కానీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియా సంఘాల నాయకులు జర్నలిస్టులు లిస్టు ఇవ్వాలని, ఆ లిస్టులో ఉన్న వాళ్ల తప్పు చేస్తే ఏ శిక్ష వేయాలో మీరే నిర్ణయించాలన్నారు. ఆ లిస్ట్లో లేని వాడు జర్నలిస్ట్ కాడని, అలాంటి వాళ్లను క్రిమినల్స్ లాగే చూడాల్సి వస్తుందని తెలిపారు. అలాంటి క్రిమినల్స్ ముసుగు ఊడదీసి, బట్టలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..
Updated Date - 2025-03-15T16:14:51+05:30 IST