ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్‌ విజన్‌ అద్భుతం

ABN, Publish Date - Jun 20 , 2025 | 03:34 AM

తెలంగాణ రైజింగ్‌ - 2047’ విజన్‌ అద్భుతంగా ఉందని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ ప్రశంసించారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రణాళిక ఉందని కొనియాడారు.

  • రాష్ట్ర సుస్థిరాభివృద్ధి దిశగా రేవంత్‌ రెడ్డి ప్రణాళిక

  • సీఎంపై బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ ప్రశంసలు

  • ఫ్యూచర్‌ సిటీ, స్కిల్స్‌, స్పోర్ట్స్‌ వర్సిటీలపై ఆసక్తి

  • లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ మార్చుకున్న తెలంగాణ, టోనీ బ్లెయిర్‌ ఇన్‌స్టిట్యూట్‌

న్యూఢిల్లీ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ రైజింగ్‌ - 2047’ విజన్‌ అద్భుతంగా ఉందని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ ప్రశంసించారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రణాళిక ఉందని కొనియాడారు. యూకేకు ఆయన 1997 - 2007 మధ్య పదేళ్లపాటు ప్రధానిగా పనిచేశారు. ఇంగ్లండ్‌ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. రాజకీయాల నుంచి తప్పుకొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని నాయకులకు విజన్‌, వ్యూహ రచన.. వాటి అమలుకు సహకరించాలనే ఉద్దేశంతో ‘టోనీ బ్లెయిర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ చేంజ్‌ (టీబీఐజీసీ) స్థాపించారు. ఇందులో భాగంగా, ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న టోనీ బ్లెయిర్‌తో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. పట్టణ, పట్టణ శివారు, గ్రామీణ ప్రాంతాల వారీగా తాము అమలు చేయబోయే సూక్ష్మ ప్రణాళికను ఆయనకు వివరించారు. ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ ముఖ్యాంశాలను తెలిపారు.

తమ ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది డిసెంబరు 9న ఈ విజన్‌ గురించి ప్రజలకు వెల్లడిస్తామన్నారు. ‘ఫ్యూచర్‌ సిటీ’, ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’, ‘యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ‘ వంటి ప్రాజెక్టులపై టోనీ బ్లెయిర్‌ ఆసక్తి చూపారు. ఇరు నేతలు గంటకుపైగా సమావేశమైన అనంతరం.. తెలంగాణ రైజింగ్‌ విజన్‌ రూపకల్పన, అమలులో భాగస్వామ్యానికి తెలంగాణ ప్రభుత్వం, టీజీఐజీసీ ప్రతినిధులు ఉద్దేశ పత్రాన్ని పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా, తెలంగాణలో రైతులు, యువత, మహిళలు వంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు టోనీ బ్లెయిర్‌కు సీఎం రేవంత్‌ వివరించారు. మానవాభివృద్ధి సూచికల్లో అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్‌ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌ రెడ్డి, రాష్ట్ర పారిశ్రామిక, పెట్టుబడుల విభాగం సీఈవో జయేశ్‌ రంజన్‌, పారిశ్రామిక, వాణిజ్య విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్దన్‌ రెడ్డి, టీబీఐజీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

3 నెలల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ 644 కోట్లు

  • ప్రభుత్వానికి రూ.1990.94 కోట్ల ఆదాయం

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారికి లేఔట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద గత మూడు నెలల్లో దరఖాస్తుదారులకు రూ.644.78 కోట్ల రాయితీ లభించగా, ప్రభుత్వానికి రూ. 1990.94 కోట్ల ఆదాయం లభించిందని పురపాలకశాఖ అధికారులు తెలిపారు. గత మార్చిలో అందుబాటులోకి తెచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకున్న వారికి.. ఫీజు చెల్లింపులో 25ు రాయితీనిచ్చింది. దీంతో మార్చిలో ప్రభుత్వానికి రూ.1402.02 కోట్ల ఆదాయం లభించగా, రూ.482.11 కోట్ల రాయితీ, ఏప్రిల్‌లో రూ.353.17 కోట్ల ఆదాయం, రూ.121.62 కోట్ల రాయితీ, గత నెలలో రూ.119.84 (తొలి 3 రోజుల్లో రూ.44.59 కోట్లు) కోట్ల ఆదాయం రాగా, రూ.40.99 కోట్ల (తొలి మూడు రోజుల్లో రూ.15.29 కోట్లు) రాయితీ కల్పించింది.

ఇవి కూడా చదవండి:

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ

యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత

ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 20 , 2025 | 03:34 AM