Delhi Visit: ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Jun 19 , 2025 | 09:46 AM
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఉదయం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఏపీ సమర్పించిన పీఎఫ్ఆర్పై కేంద్రం తెలంగాణ స్పందన కోరింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి పూర్తి వివరాలు ఇవ్వనున్నారు.
Hyderabad: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనకు (Delhi Visit) బయలుదేరి వెళ్లారు. సీఎంతోపాటు మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కూడా వెళ్లారు. గురువారం ఉదయం 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఉదయం 11 గంటలకు బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయర్ (Tony Blair), గ్లోబల్ చేంజ్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం భేటీ అవుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జల శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం అవుతారు. గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును నిలువరించాలని కోరనున్నారు.
కాగా ఏపీ సమర్పించిన పీఎఫ్ఆర్పై కేంద్రం తెలంగాణ స్పందన కోరింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి పూర్తి వివరాలు ఇవ్వనున్నారు. గోదావరి-బనకచర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా కట్టడి చేయాలని కోరనున్నారు. అలాగే.. కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో సమావేశమై.. మెట్రో విస్తరణ సహా పలు అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఏఐసీసీ (AICC) పెద్దలను కలిసి పెండింగ్ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నట్టు సమాచారం. అలాగే పార్టీ అధిష్టానాన్ని, పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారు. కాగా మంత్రి ఉత్తమ్ బుధవారం రాత్రికే ఢిల్లీకి చేరుకున్నారు.
ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ (టీబీఐ) అనే ఎన్జీవోను నడిపిస్తున్నారు. ఇది అనేక దేశాల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన భేటీలో టోనీబ్లెయిర్తో పలు విషయాలపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా రేవంత్రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఏడాదిన్నరలో చాలా సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్ళివచ్చారు. వివిధ సందర్భాల్లో అధిష్టానం పెద్దల్ని కలిసి మంతనాలు జరిపారు. కాగా ఈ మధ్య తాజాగా ఢిల్లీ వెళ్ళి వచ్చాక రేవంత్ రెడ్డి వైఖరిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆయనను దగ్గరగా గమనిస్తున్నవారు అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. కొత్త బలం వచ్చినట్టుందని, కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరిగాయని చెప్పుకుంటున్నారు. గడిచిన 18 నెలలుగా.. ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో ఎవరేం చేసినా.. ఏం మాట్లాడినా చూసీ చూడనట్టే సీఎం ఉన్నారు. కేబినెట్ మంత్రుల మీద రకరకాల ఆరోపణలు వచ్చినా.. అంత సీరియస్గా తీసుకున్నట్టు కనిపించడంలేదు. కానీ, ఇప్పుడు ఆయన వైఖరి చూస్తుంటే.. అదంతా గతం. ఇక మీదట అలాంటివేవీ నడవవ్ అన్నట్టుగా ఉందని అనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం..
ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
డోనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోదీ షాక్..
For More AP News and Telugu News
Updated Date - Jun 19 , 2025 | 09:46 AM