ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Miss World: మిస్ వరల్డ్‌కు సర్వం సిద్ధం

ABN, Publish Date - May 09 , 2025 | 07:14 AM

Miss World competitions: మిస్ వరల్డ్ పోటీలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలు భారతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక మేలవింపుగా అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వీవీఐపీ బ్లాకులు, మీడియా గ్యాలరీ, భద్రత, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన పోటీదారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Miss World competitions

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మిస్‌ వరల్డ్‌ పోటీలు (Miss World competitions) శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. గచ్చిబౌలి స్టేడియం (Gachibowli Stadium)లో జరగనున్న మిస్ వరల్డ్–2025 పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ఇప్పటికే 109 దేశాలకు చెందిన పోటీదారులు, ప్రతినిధులు, ఆహ్వానితులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం రిహార్సల్స్ ఉత్సాహంగా జరిగాయి. అందాల భామలు స్టేజ్‌పై తమ నడకలతో, నవ్వులతో, ఆకర్షణీయ కాస్ట్యూమ్స్‌తో అందంగా కనిపించారు. వారి ప్రతిభకు తగిన కార్యక్రమాలను ఎంపిక చేసుకొని ప్రాక్టీస్ చేశారు.


అందరినీ ఆకట్టుకునేలా ప్రారంభ వేడుకలు..

మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలు భారతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక మేలవింపుగా అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వీవీఐపీ బ్లాకులు, మీడియా గ్యాలరీ, భద్రత, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన పోటీదారులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. మరికొంత మంది రెండు రోజుల్లో వస్తారని మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులు తెలిపారు. మిస్‌ వరల్డ్‌ సంస్థ నుంచి 28 మంది నిర్వహణా ప్రతినిధులు, 17 మంది సహాయకులు వచ్చారు.

Also Read: కాందహార్‌ సూత్రధారి రవూఫ్‌ హతం


ఓల్డ్‌ సిటీలో హెరిటేజ్‌ వాక్‌...

కాగా హైదరాబాద్‌ నగర సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో మిస్‌ వరల్డ్‌ పోటీదారులతో మే 13న చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్‌ను నిర్వహించనున్నారు. చార్మినార్‌కు పశ్చిమ భాగంలో విస్తరించిన లాడ్‌బజార్‌లో సంప్రదాయ లక్కగాజులు ఇతర కళాత్మక వస్తు సామగ్రిని ఉత్పత్తి చేసి విక్రయించే స్థానిక కళాకారులతో మిస్‌ వరల్డ్‌ పోటీదారులు సంభాషించనున్నారు. ఈ హెరిటేజ్‌ వాక్‌ కార్యక్రమం నుమారు 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ సందర్భంగా చారిత్రక చార్మినార్‌ కట్టడం, లాడ్‌ బజార్‌ ప్రత్యేకతలను వివరించి వరల్డ్‌ టూరిస్ట్‌ డెస్టినేషన్‌ స్పాట్‌గా ప్రమోట్‌ చేయనున్నారు. కాగా, ప్రకృతి, పర్యావరణ పరంగా అన్ని హంగులు ఉన్న తెలంగాణను పర్యాటక రంగంలో ముందు వరుసలో నిలిపే లక్ష్యంతో ‘తెలంగాణ- జరూర్‌ ఆనా..’ నినాదాన్ని విసృత స్థాయిలో ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పర్యాటకరంగం పెరగటం, పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశిస్తోంది. మే 31 వరకు కొనసాగే మిస్‌వరల్డ్‌ కార్యక్రమాల్లో సాధారణ ప్రజలను కూడా పరిమిత సంఖ్యలో భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టూరిజం వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ (https://tourism.telangana.gov.in/event ssingle/missworldevent) చేసుకున్న వారికి ఐదు కేంద్రాల్లో వేయి మంది చొప్పున మొత్తం ఐదువేల మందికి మిస్‌ వరల్డ్‌ పోటీలను వీక్షించే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.


కట్టుదిట్టమైన భద్రత

మిస్‌ వరల్డ్‌ పోటీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ గజరావ్‌ భూపాల్‌ తెలిపారు. గురువారం ఆయన ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీదారులు బస చేస్తున్న హోటళ్ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఎక్కువ మంది బస చేస్తున్న ట్రిడెంట్‌ హోటల్‌ వద్ద నాలుగంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీవీఐపీ కేటగిరీని బట్టి వారు బస చేస్తున్న పరిసరాలను గ్రీన్‌జోన్‌, రెడ్‌ జోన్‌గా విభజించామని చెప్పారు. మిస్‌ వరల్డ్‌ పోటీలకు వివిధ దేశాలకు చెందిన అతిథులతో పాటు, దేశంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రెటీలు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎలాంటి ట్రాఫిక్‌ మళ్లింపులు ఉండవని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

ప్రత్యేక కమిషనర్, సమాచార శాఖ, హైదరాబాద్.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు గుంటూరు సీఐడీ ఆఫీసుకు సజ్జల, దేవినేని

సిందూర్‌ టైటిల్‌ కోసం 30 మంది పోటీ

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 07:14 AM