ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి అన్నీ అబద్ధాలే: కేటీఆర్

ABN, Publish Date - Jul 07 , 2025 | 05:37 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో పని చేసిన ముఖ్యమంత్రులంతా హుందాగా వ్యవహరించారని చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అలా కాదన్నారు.

BRS Working President KTR

హైదరాబాద్, జులై 07: సీఎం రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారని.. అవి చేయలేదని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఉమ్మడి మెదక్ జిల్లాలకు చెందిన పలు పార్టీల నేతలు.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి కోతలు సరిపోవని.. కర్రు కాల్చి వాతలు పెట్టాలన్నారు. ఆ విధంగా మీరందరూ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

గతంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశామని.. కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని తాను చూడలేదంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిది నోరా లేకుంటే మోరీనా అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రుణ మాఫీ లేదు.. రైతు బంధు లేదంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని ఎద్దేవా చేశారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని.. అందుకే వందనా నీ బొందనా అని తాను స్పందించానని కేటీఆర్ చెప్పారు. ఇది కోతల ప్రభుత్వమంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభివర్ణించారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చున్నారంటేనే.. అందుకు కేసీఆరే కారణమన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ లేకపోతే.. గులాబీ జెండా ఎగరకుంటే.. తెలంగాణ వస్తుండేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియదా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.

పదేళ్ల పాటు తాము సైతం అధికారంలో ఉన్నామన్నారు. కానీ తాము ఈ విధంగా ఎగిరెగిరి పడలేదన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ఆరాచకాలను ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అక్కడికెళ్లి ఏం చేస్తావు జగన్

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కేవలం రూ.100తో భూముల రిజిస్ట్రేషన్‌..

For More Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 09:59 PM