ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: పార్టీ మార్పుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - May 13 , 2025 | 04:42 PM

బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పంచాయితీ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు స్పష్టం చేశారు. పార్టీ మారుతానని‌.. జరుగుతోన్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని సూచించారు.

Harish Rao

Harish Rao: పార్టీ మార్పుపై వచ్చే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేటీఆర్ నాయకత్వంపై అనేక సార్లు నా అభిప్రాయాన్ని చెప్పానని, మాపార్టీలో ఎలాంటి పంచాయితీ లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతానని‌ జరుగుతోన్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని ఆయన సూచించారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ నాయకత్వ భాధ్యలు అప్పగిస్తే స్వాగతిస్తానని, క్రమశిక్షణ గల కార్యకర్తగా కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పక పాటిస్తానని క్లారిటీ ఇచ్చారు.


ఈ నేపధ్యంలోనే రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం అమ్మకోవటానికి రైతులు కల్లాల్లో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ధాన్యం రాశులను వదిలేసి.. రేవంత్ అందాల రాశుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శలు గుప్పించారు. అందాల పోటీల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉంటున్నారని.. పాకిస్తాన్‌ను నమ్మి అప్పు ఇస్తున్నారు కానీ.. రేవంత్ రెడ్డిని నమ్మి అప్పు ఇవ్వడం లేదని సెటైర్లు వేశారు. రుణమాఫీ, రైతుబంధుపై సీఎం‌ ఎందుకు రివ్యూ చేయటం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో రైతుల మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని, చనిపోయిన రైతులకు 25లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.


హామీలు అమలు చేయనందుకు తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో, ఢిల్లీకి డబ్బులు పంపటంలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని.. 48గంటల్లో కాదు కదా.. నెల రోజులకు కూడా రైతులకు డబ్బులు పడటం లేదని, ఐదు పైసలు కూడా బోనస్ కింద విడుదల చేయలేదని మండిపడ్డారు. పెట్టుబడి సాయం మెల్లగా.. ఏడాది పొడవునా ఇస్తామని భట్టి చెప్పటం సిగ్గుచేటి దూషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని నిప్పులు చెరిగారు. పది కిలోల తరుగు తీస్తున్నారని.. సీతక్క నియోజకవర్గంలో జట్టి రాజు ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల కష్టాలపై సీఎం రేవంత్ సమీక్ష చేయడని.. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ఉండి.. వడదెబ్బతో రైతులు చనిపోతున్నారని ధ్వజమెత్తారు.


Also Read:

Ban Turkey: పాకిస్తాన్‌కు సహాయం.. టర్కీకి వందల కోట్ల రూపాయల నష్టం

Kolkata Airport on High Alert: బాంబు బెదిరింపు కాల్.. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్

DD Next Level Movie: శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్న మూవీపై పోలీసులకు ఫిర్యాదు

Updated Date - May 13 , 2025 | 05:47 PM