ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Wildlife Safari Tour: వణ్యప్రాణులను చూడటానికి దేశంలోని 5 ఉత్తమ ప్రదేశాలివే..

ABN, Publish Date - Jun 29 , 2025 | 03:59 PM

భారతదేశం అనేక రకాల వణ్యప్రాణులకు నిలయమని చెప్పొచ్చు. వణ్యప్రాణులను చూడాలనుకునే వారికి అనేక ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ..

1/6

భారతదేశం అనేక రకాల వణ్యప్రాణులకు నిలయమని చెప్పొచ్చు. వణ్యప్రాణులను చూడాలనుకునే వారికి అనేక ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో 5 ఉత్తమ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2/6

రాజస్థాన్‌‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్ దేశంలోనే ప్రసిద్ధి చెందింది. ఈ పార్క్‌లో వణ్యప్రాణులతో పాటూ పురాతన శిథిలాలు, చారిత్రాత్మక కోటలను కూడా చూడొచ్చు. బెంగాల్ టైగర్‌తో పాటూ అనేక రకాల పులులు, చిరుతులు, ఎలుగుబంట్లు, మొసళ్లు తదితరాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

3/6

అస్సాంలోని కాజీరంగ జాతీయ ఉద్యానవనం కూడా వణ్యప్రాణుల సదర్శనకు ఉత్తమ ప్రదేశమని చెప్పొచ్చు. అంతరించిపోతున్న ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను ఒక్కడ చూడొచ్చు. అలాగే అడవి నీటి గేదెలు, చిత్తడి జింకలతో పాటూ వివిధ రకాల పక్షులను కూడా ఇక్కడ సందర్శించవచ్చు.

4/6

మధ్యప్రదేశ్‌లోని కన్హా నేషనల్ పార్క్.. దేశంలోని సుందరమైన జాతీయ ఉద్యానవనాల్లో ఒకటి. ఇక్కడ బెంగాల్ టైగర్, చిత్తడి జంకలు, చిరుతలు, అడవి కుక్కలు తడితర జంతువులను చూడొచ్చు.

5/6

పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనంలోనూ అనేక వణ్యప్రాణులను చూడొచ్చు. ఈ ప్రాంతం రాయల్ బెంగాల్ టైగర్ నివాస స్థలమని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ అనేక మొసళ్లు, అరుదైన పక్షులు కూడా కనువిందు చేస్తాయి.

6/6

కర్ణాటక బందీపూర్ జాతీయ ఉద్యానవనం.. ఏనుగులు, పులులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక వణ్యప్రాణులతో పాటూ అనేక రకాల వృక్షాలు, పచ్చని ప్రకృతి పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

Updated Date - Jun 29 , 2025 | 03:59 PM