తొలి విడత పంచాయతీ పోలింగ్... గ్రామాలకు తరలివెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది
ABN, Publish Date - Dec 10 , 2025 | 05:03 PM
తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు (గురువారం) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంకానుంది. తొలి దశలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
తొలి విడత గ్రామ పంచయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.
రేపటి (గురువారం) ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
3836 గ్రామపంచాయతీలకు, 27,960 వార్డులకు పోలింగ్ జరుగనుంది.
13127 మంది సర్పంచ్ పదవికి పోటీ చేయనున్నారు.
67,893 మంది వార్డ్ మెంబర్ కోసం పోటీకి దిగారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలికల కళాశాల మైదానంలో సర్పంచ్ ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్తున్న ఎన్నికల అధికారులు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం మెటీరియల్ను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న అధికారులు.
ఎన్నికల సామాగ్రిని గ్రామాలకు తీసుకెళ్తున్న అధికారులు
ఎన్నికల కేంద్రాలకు తరలించే సామాగ్రిని, బాలెట్ బాక్స్లను సిద్ధం చేసుకుంటున్న ఎన్నికల అధికారులు.
ఎలక్షన్ సామాగ్రితో బస్సుల్లో గ్రామాలకు వెళ్తున్న సిబ్బంది.
ఎన్నికల్లో బందోబస్తు గురించి పోలీస్ సిబ్బందితో మాట్లాడుతున్న వనపర్తి జిల్లా ఎస్పీ సునీత. డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ శాఖ సిబ్బంది, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వనపర్తి జిల్లాలో గోపాల్ పేట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ ఆదర్శ్ సురభి.
Updated Date - Dec 10 , 2025 | 05:07 PM