Home » Local Body Elections
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని ఆయన ఆ లేఖలో కోరారు.
మధ్యాహ్నం 3 గంటల వరకూ వెలువడిన ఫలితాల సరళి ప్రకారం, మహాయుతి కూటమి 214 స్థానాల్లో గెలుపును ఖాయం చేసుకోగా, బీజేపీ 118 స్థానాల్లో ఆధిపత్య సాగిస్తోంది.
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ .. ఒంటి గంటకు ముగిసింది. అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఎవరు ఎక్కడ గెలిచారనే పూర్తి సమాచారం ఇక్కడ మీకోసం..
సిద్ధిపేట జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా మొత్తంగా 508 గ్రామ పంచాయతీలకు, అదే విధంగా 4508 వార్డులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 399 ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. 3000 మందిని బైండోవర్ చేశారు.
వరంగల్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడి చేశారు.
డిసెంబర్ 20వ తేదీన సరైన ముహూర్తాలు లేవని.. 22కు వాయిదా వేయాలని ప్రజా ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. వారి విజ్ఞప్తులపై పంచాయతీరాజ్ శాఖ సానుకూలంగా స్పందించింది.
మూడవ దశలో భాగంగా 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో 394 సర్పంచి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
కొమురంభీం ఆసిఫాబాద్లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కాగజ్ నగర్ మండలం రాస్పెల్లికి చెందిన సర్పంచ్ అభ్యర్థి బొమ్మెల్ల రాజయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
అభ్యర్థులు ప్రచార పర్వం కొనసాగిన ప్రతిరోజు మందు, మాంసంతో విందులు కొనసాగించారు. పల్లెలను మత్తులో ఉంచారనే విమర్శలు వచ్చాయి. ప్రతి ఇంటికి మటన్, చికెన్, కానుకలు పంపిణీ చేశారు.
గ్రామపంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. నేడు మూడో విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నారు. ఇంటింటికి వెళ్లి గడపకు బొట్టు పెట్టి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.