ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chevvella Bus Tipper Truck Collision: బస్సును ఢీకొట్టిన టిప్పర్.. మృతి చెందిన విద్యార్థులకు ఘన నివాళి

ABN, Publish Date - Nov 04 , 2025 | 04:52 PM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖ్వాజీ గూడ సమీపంలో సోమవారం (03-11-2025)ఉదయం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ కోటిలోని ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారు. వీరి మరణంతో..ఆ కుటుంబ సభ్యులతోపాటు సహచర విద్యార్థులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.

1/6

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖ్వాజీ గూడ సమీపంలో సోమవారం (03-11-2025)ఉదయం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు.

2/6

వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ కోటిలోని ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారు. వీరి మరణంతో..ఆ కుటుంబ సభ్యులతోపాటు సహచర విద్యార్థులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.

3/6

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో స్థానిక గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్‌కు నలుగురు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తెకు ఇటీవల వివాహం చేశారు.

4/6

మిగిలిన ముగ్గురు కుమార్తెలు తనూష, సాయి ప్రియ, నందిని. వీరు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తూ.. ఈ ప్రమాదంలో మరణించారు.

5/6

ఇక సాయి ప్రియతోపాటు అదే కళాశాలలో చదువుతున్న ముస్కాన్ అనే యువతి సైతం ఇదే బస్సు ప్రమాదంలో మరణించింది. దీంతో ఇద్దరు స్నేహితురాళ్లు ఈ ప్రమాదంలో మరణించడంతో వారి స్నేహితులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

6/6

కోఠి ఉమెన్స్ కాలేజీకి చెందిన ఈ విద్యార్థులకు సహచర విద్యార్థులు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. వారితో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు గుర్తు చేసుకున్నారు.

Updated Date - Nov 04 , 2025 | 04:58 PM