Cyclone Montha: మొంథా తుఫాను ఎఫెక్ట్.. ఖమ్మంలో దెబ్బతిన్న మిర్చి, పత్తి పంటలు
ABN, Publish Date - Oct 29 , 2025 | 09:53 PM
ఖమ్మం జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది. కుండపోతగా వర్షం పడటంతో వాగులు, చెరువులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. జిల్లాలోని పలు మండలాల్లో వరి, మిర్చి, పత్తి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. చేలల్లోకి నీరు భారీగా చేరడంతో పంట నేలకొరిగింది.
ఖమ్మం జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది.
కుండపోతగా వర్షం పడటంతో వాగులు, చెరువులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలోని పలు మండలాల్లో వరి, మిర్చి, పత్తి పంటలకు తీవ్ర నష్టం కలిగింది.
పత్తిలోకి నీరు భారీగా చేరడంతో పంట నేలకొరిగింది.
భారీ వర్షానికి పత్తి చేలు నల్లగా మారాయి.
భారీ వర్షంతో నేలకొరిగిన మిర్చి మొక్కలు
భారీ వర్షం ధాటికి నల్లగా మారిన పత్తి చేలు, మరో చిత్రంలో పత్తి నుంచి కారుతున్న నీరు.
నేలకొరిగిన వరి పైరు
Updated Date - Oct 29 , 2025 | 10:01 PM