Home » Khammam
తెలంగాణ ప్రజల అవసరాలే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాలకూ సంక్షేమం అందుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు.
రాజీవ్ లింక్ కెనాల్కు గోదావరి జలాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా లేక పంటల సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు.. సాగర్ ఆయకట్టుకు భరోసాగా మారిందని మంత్రి తెలిపారు.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో భద్రాద్రి కొత్తగూడెం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటిమట్టం 55.90 అడుగులకు చేరింది. దాదాపు 15,84,657 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈరోజు(శుక్రవారం) ఉదయం భద్రాచలం వల్ల గోదావరి నీటి మట్టం 44 అడుగులకు చేరింది.
రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వేను పూర్తి చేసి.. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో గురువారం కల్లూరు, తల్లాడ మండలాల స్థాయి ప్రజాదర్బార్ను నిర్వహించారు.
గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందని, పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనాపురంలో నిర్మించిన గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ కాంప్లెక్స్ నిర్మించడం సంతోషంగా ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సింగరేణిని అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ఆరోపించారు.
రైతు భరోసా తుది విడత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఖమ్మంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. అన్నదాతల నిధులు విడుదల చేసేందుకు బటన్ నొక్కారు. అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మణుగూరులో పర్యటించారు. రెండో విడత ‘బాయిబాట’ రెండో రోజు పర్యటనలో భాగంగా మణుగూరు సింగరేణి పీకే ఓసీపీ-2ను సందర్శించారు.