Home » Farmers
సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతు జేబుకు చిల్లు పడుతోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన వాళ్లే అన్నదాతలతో ఆడుకుంటున్నారు. సాధారణంగా పరీక్షల్లో వందకు 35 మార్కులు వస్తే పిల్లలను టీచర్లు పాస్ చేస్తారు. అలానే రైతులు తీసుకొచ్చిన పత్తి బండి సీసీఐ కొనుగోలు కేంద్రంలోనికి వెళ్లాలంటే.. క్వింటాల్ కు రూ.20లు చెల్లిస్తేనే పాస్ చేస్తున్నారు. లేదంటే లోనికి పంపేది లేదని మంకుపట్టు పడుతున్నారు. ఇది అప్పటికి చిన్న దోపిడీలా కనిపించినా.. కొనుగోళ్లు పూర్తయ్యే సరికి రూ.కోట్లకు చేరుకుంటోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని సీసీఐ కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
జఠిలమైన వ్యవసాయ సమస్య పరిష్కరించడానికి ఐదు సూత్రాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.. ఇందులో భాగంగానే నీటి భద్రత కల్పించాలని భావించామని పేర్కొన్నారు. గంగా, కావేరి నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించామని తెలిపారు.
రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు జిల్లాలోని రైతుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు వెళ్లి.. పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై వివరిస్తున్నారు.
పంట నష్ట పరిహారం విషయంలో విత్తన ముసాయిదా బిల్లులో స్పష్టత లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కేంద్ర ముసాయిదా విత్తన బిల్లుపై అభ్యంతరాలు, సవరణలు గట్టిగానే తెలుపుతామని హెచ్చరించారు.
అన్నదాతలు అధైర్యపడవద్దని.. వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భరోసా కల్పించారు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతన్నలతో సమావేశం అయ్యారు.
సీఎం చంద్రబాబు తన విజనరీతో అన్నతాతలకు పంచ సూత్రాలను అందిస్తున్నారని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. పంచ సూత్రాల ద్వారా రైతులు తమ ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్తో పోటీ పడతారని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందడం లేదు. ప్రతి ఏటా గుర్తింపు కార్డులను కొద్దిమంది కౌలు రైతులకు మాత్రమే జారీ చేస్తుండడంతో ప్రభుత్వ ఇచ్చే వివిధ రాయితీలు, ప్రోత్సాహకాలకు దూరమవుతున్నారు.
వ్యవసాయ మంత్రికి రైతన్నలపై ప్రేమ ఉంటే నిన్న(సోమవారం) జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. దమ్ముంటే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20వేలు ప్రకటించాలని సవాల్ చేశారు కేటీఆర్.
ఆదోని పట్టణంలో ఈనెల 18,19వ తేదీల్లో చేపట్టే పత్తి రైతుల రాష్ట్ర సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్నగౌడ్, సీపీఐ మండల కార్యదర్శి రాజీవ్ కోరారు.