Home » Farmers
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. రైతులను చిన్న చూపు చూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఢిల్లీ పెద్దల చుట్టూరు తిరగడమే తప్ప.. అన్నదాతల ఆర్థనాదాలు వినబడవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలు వినే ఓపిక లేదా అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నలు కురిపించారు.
Telangana: పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయి. నిజామాబాద్ మార్కెట్లో రికార్డు స్థాయిలో పసుపు ధర పలికింది. క్వింటాల్ పసుపు ధర రూ.20 వేలు దాటింది. గురువారం రైతు మల్లయ్య క్వింటాల్ పసుపును రూ.20,150కు అమ్మాడు. దాదాపు 13 ఏళ్ళ తర్వాత పసుపు ధర రూ.16వేల దాటింది.
ఎండిపోతున్న చెరువులు.. అడుగంటుతున్న బావులు..! ముదురుతున్న ఎండలు.. లోలోతుకు భూగర్భ జలాలు..! పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు..! గొంతు తడుపుకొనేందుకు ఇంటికి ట్యాంకర్లు..! వెరసి ఆయకట్టుకు కటకట.. తాగునీటికి తంటా..! ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితి..! వర్షాలు సమృద్ధిగా కురవని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
వరంగల్: విద్యుత్తు మరమ్మతుల కోసం స్తంభంపైకి ఎక్కిన రైతుకు కరెంట్ షాక్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇస్లావత్ శ్రీను(40) అనే రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద కరెంట్ వైర్ రిపేర్ కోసం స్తంభంపైకి ఎక్కిన శ్రీను.. జంపర్ మార్చుతుండగా విద్యుత్తు సరఫరా కావడంతో షాక్ కొట్టింది.
ఈరోజు రైల్ రోకో ఉద్యమానికి రైతులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పంజాబ్-హర్యానా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిరసనలు తెలుపనున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు ఈ నిరసన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పలు ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. నిన్న(బుధవారం) రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టిన ‘రైతునేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఏడాదిగా సరైన వర్షపాతం లేకపోవడంతో రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని, అందుకే అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని సీఎం అన్నారు. ఈ వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం నాడు ‘రైతు నేస్తం’(Rythu Nestham) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) పాల్గొన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమమే ‘రైతు నేస్తం’.
Telangana: రైతు నేస్తం పేరుతో ప్రతి రైతులతో నేరుగా మాట్లాడేందుకు వ్యవసాయ శాఖ సరికొత్త ప్రోగ్రాంకు నాంది పలికింది. రియల్ టైం సొల్యూషన్స్ త్రు డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రాజెక్టును వ్యవసాయ శాఖ రూపొందించింది. శాస్త్రవేత్తలు, అధికారులను అనుసంధానం చేసే విధంగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించనున్నారు.
డిమాండ్లు నెరవేర్చాలని రైతులు మరోసారి ఛలో ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. కొద్దిరోజుల క్రితం చేపట్టిన ఢిల్లీ మార్చ్ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రైతులతో పోలీసుల మధ్య తోపులాటలో ఇరు వర్గాలు గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో కొద్దిరోజులు ఆందోళనకు విరామం ఇచ్చారు. తిరిగి బుధవారం (ఈ రోజు) ఢిల్లీ ముట్టడిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. బస్సు, రైళ్ల ద్వారా ఢిల్లీకి రైతులు బయల్దేరారు. రైతు నేతల ఢిల్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ దేశ రాజధాని సరిహద్దులో శాంతియుతంగా నిరసనలు చేస్తున్న రైతులకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దిల్లీలోకి రాకుండా వారిని నిలువరించేందుకు బారికేడ్లు, కంచెలు నిర్మించారు.