Home » Farmers
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంటల బీమా పోర్టల్స్ గత వారం రోజులుగా మొరాయిస్తున్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో నమోదు చేసుకోవటానికి రాష్ట్రంలోని వరి రైతులు ప్రయత్నిస్తుండగా, పోర్టల్స్ ఓపెన్ కావట్లేదు. నేషనల్ క్రాప్ ఇన్యూరెన్స్ పోర్టల్, పీఎంఎ్ఫబీవై పోర్టల్.. ఏదీ ఓపెన్ కావట్లేదని రైతులు వాపోతున్నారు.
పత్తికి డిమాండ్ బాగా పెరిగింది. పంటంతా రైతుల చేయి దాటిపోయిన తర్వాత ధర పెరుగుతోంది. రైతుల చేతిలో పంట ఉన్నప్పుడు క్వింటా రూ.6 వేలకు కూడా కొనేవారు లేరు. నేడు కనీస మద్దతు ధరను మించిపోయింది.
పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు పత్తి అమ్మే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు.
ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆక్వా రైతన్నలకు విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు(సోమవారం) ఏలూరు జిల్లాలోని కలిదిండిలో ’మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేశారు.
పొగాకు రైతులకు ఒక్కొక్కరికి రూ.50 వేలను రుణం రూపంలో అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. రెండేళ్ల పాటు వడ్డీ లేకుండా రూ. 50 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తరపున క్వింటాలుకు రూ.1000లను ఇస్తామని తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా గత పాలకులు ఆర్భాటంగా అనేక డివిజన్లు, జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని.. ఎక్కడ కూడా ఆఫీసులు, ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు క్షుద్ర రాజకీయాలు తెలియవు అని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనలో గొడ్డలి పార్టీ శ్రేణులు బస్సులు అడ్డుపెట్టి, సైలెన్సర్లు తొలగించి బలప్రదర్శన చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించాయని ధ్వజమెత్తారు.
దేశంలో ఎరువుల పంపిణీని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్ను అమలులోకి తీసుకువస్తోంది. రైతులు నేరుగా ఎరువుల దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘాలకు వెళ్లకుండా... ముందుగా ఈ యాప్లోనే ఎరువులు బుక్ చేసుకుని ఆ తర్వాత నిర్ణీత సమయానికి వెళ్లి తెచ్చుకునేలా ఈ వ్యవస్థను అమలుచేయనుంది.