Home » Farmers
నేలమీద వ్యవసాయం మనకు తెలుసు. నీటిమీద సాగు మనకు సరికొత్త వ్యవసాయ విధానం. అందునా సముద్రంలో సేద్యం.. ఎలా సాధ్యం అని ఆశ్చర్యం సహజం. ఇప్పుడా వ్యవసాయం మన తిరుపతి జిల్లాలోనే ప్రయోగాత్మకంగా మొదలైంది. అత్యంత విలువైన సముద్రపు నాచును బంగాళాఖాతంలో వాకాడు, తడ మండలాల్లోని మత్స్యకార మహిళలు పండిస్తున్నారు.
మండలంలోని ఐరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం మొత్తం 4.99 ఎకరాల సంబంధించి 16 మంది రైతులకు నష్టపరిహారం అందించి న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ తెలిపారు.
ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు రూ. లక్ష వరకూ రుణం మంజూరు చేయబోతోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. రైతు కౌలు పత్రంలో చూపించిన సాగు భూమి ఎకరాకు తగ్గకుండా ఉండాలి.
మధ్యప్రదేశ్లోని టికమ్గఢ్ జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎరువుల కోసం క్యూ లైన్లో నిల్చున్న ఓ రైతు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
అక్కడ పంప్ తిప్పితే చాలు... ద్రవ జీవామృతం వస్తుంది. అవసరం ఉన్నవారు ఎప్పుడంటే అప్పుడు పట్టుకొని మొక్కలకు వేసుకుంటారు. ఈ జీవ ఎరువులను రైతులే స్వయంగా తయారు చేస్తారు. అందుకే ఆ గ్రామం ప్రకృతి సేద్యంతో పచ్చగా మారింది!
సాధారణంగా పరీక్షల్లో వందకు 35 మార్కులు వస్తే పిల్లలను టీచర్లు పాస్ చేస్తారు. అలానే రైతులు తీసుకొచ్చిన పత్తి బండి సీసీఐ కొనుగోలు కేంద్రంలోనికి వెళ్లాలంటే.. క్వింటాల్ కు రూ.20లు చెల్లిస్తేనే పాస్ చేస్తున్నారు. లేదంటే లోనికి పంపేది లేదని మంకుపట్టు పడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని సీసీఐ కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
జఠిలమైన వ్యవసాయ సమస్య పరిష్కరించడానికి ఐదు సూత్రాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.. ఇందులో భాగంగానే నీటి భద్రత కల్పించాలని భావించామని పేర్కొన్నారు. గంగా, కావేరి నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించామని తెలిపారు.
రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు జిల్లాలోని రైతుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు వెళ్లి.. పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై వివరిస్తున్నారు.
పంట నష్ట పరిహారం విషయంలో విత్తన ముసాయిదా బిల్లులో స్పష్టత లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కేంద్ర ముసాయిదా విత్తన బిల్లుపై అభ్యంతరాలు, సవరణలు గట్టిగానే తెలుపుతామని హెచ్చరించారు.
అన్నదాతలు అధైర్యపడవద్దని.. వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భరోసా కల్పించారు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతన్నలతో సమావేశం అయ్యారు.