Home » Farmers
ప్రభుత్వ గ్యారెంటీ అప్పులపై కేంద్రం ఆంక్షలు కొనసాగుతోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో ఓ ప్రభుత్వ రంగ సంస్థకు రుణం లభించనుంది. తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంక్(టీజీక్యాబ్)కు రూ.5000 కోట్ల రుణం ఇచ్చేందుకు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) అంగీకరించింది.
Andhrapradesh: ‘‘చింత చచ్చినా పులపు చావదు’’ అన్న సామెతగా ఉంది వైసీపీ నేతల ఆకృత్యాలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసి.. అధికారాన్ని కోల్పోయినప్పటికీ వారి ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. పలు చోట్ల బరితెగింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు. పైకి మాత్రం అబ్బే.. మావాళ్ల మీదే దాడులు చేస్తున్నారంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంతే కాదు ఏపీలో శాంతిభద్రతలు లేవంటూ ఏకంగా దేశరాజధాని ఢిల్లీకి వెళ్లిమరీ ధర్నాలు చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే అతి క్లిష్టమైన రుణ మాఫీ పథకాన్ని పట్టాలపైకి ఎక్కించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లోనూ వ్యవసాయ రంగానికే పెద్దపీట వేసింది.
రేవంత్ రెడ్డి సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్లో 25 శాతం ఆ రంగానికే కేటాయించింది. బడ్జెట్ మొత్తం రూ.2,91,159 కోట్లు కాగా.. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు కేటాయించింది.
తాము సాగు భూములకు పట్టాలు ఇప్పించాలని సంబంధిత రైతులు సబ్ కలెక్టర్ అపూర్వ భరతకు వినతిపత్రం అందిం చారు. సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం తనిఖీకి వచ్చిన సబ్కలెక్టర్ను గురువారం మండల పరిధిలోని నడింపల్లికి చెందిన పలువురు రైతులు కలిసి తమ సమస్యను వివరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... తాము 45ఏళ్లుగా నడింపల్లిలో సాగు చేసుకుంటున్న భూములకు పాసుపుస్తకాలు పెండింగ్లో ఉండటంతో ప్రభుత్వ పథకాలు అందడంలేదన్నారు.
చిరకాల డిమాండ్ల సాధన కోసం రైతులు గత ఫిబ్రవరి 13వ తేదీ నుంచి నిరసనలు చేస్తు్న్న అంబాలా సమీపంలోని శంభు సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు బుధవారంనాడు కీలక ఆదేశాలిచ్చింది. ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా దశలవారిగా బారికేడ్లు తొలగించాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
పండించిన పంటలపై కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చేలా చట్టం చేయాలంటూ రైతులు చిరకాల డిమాండ్ ఊపందుకోనుంది. దీనిపై విపక్షాలు ప్రైవేటు మెంబర్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ నేత, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీని 12 మంది సభ్యుల రైతు ప్రతినిధుల బృందం బుధవారంనాడు కలుసుకుంది.
మండలంలోని రైతులు సాగుచేసిన మొక్కజొన్న లో కత్తెర పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ జాన్సన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయ న సోమవారం మండల కేంద్రంలో పర్యటించి మొక్కజొన్న పంటను పరిశీలించారు. పంటను కత్తెర పురుగును ఆశించడంతో దాని నివారణకు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. మొక్కజొన్న సాగుచేసిన తరువా త తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పంటకు వాడాల్సిన మందులను ఆయన వివరించారు.
మండలకేంద్రమైన రొద్దం సమీపంలో పెన్నానదిలో నిర్మిస్తున్న వంతెన పనులను సోమవారం రైతులు అడ్డుకున్నారు. తమ భూములు కోతలకు గురవుతాయని వంతెన నిర్మాణం ఎత్తు పెంచాలని నది చుట్టుపక్కల పొలాలున్న రైతులు డిమాం డ్ చేశారు. రొద్దం సమీపంలో పెన్నానది ప్రవహించడంతో కొన్నేళ్లుగా రొద్దం నుంచి కుర్లపల్లి, కనుమర, నారనాగేపల్లి గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.
రైతుబీమా పథకంలో కొత్త రైతుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొని, పథకంలో లేని వారి పేర్లను నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి శనివారం సర్క్యులర్ జారీచేశారు.