ఆషాఢ మాసం.. అందునా చివరి ఆదివారం..
ABN, Publish Date - Jul 20 , 2025 | 08:40 PM
ఆషాఢ మాసం అది కూడా చివరి ఆదివారం కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా అమ్మ వారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఫలహారపు బండ్ల ఊరేగింపులు. విచిత్ర వేషధారణలతో రహదారులపై భక్తులు నృత్యం చేశారు. బోనాలతో భక్తులు ఊరేగింపుగా ఆలయాలకు తరలి వెళ్లారు. అమ్మవారిని సైతం ఊరేగించారు. తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా పండగ వాతావరణం నెలకొంది. సంగారెడ్డిలో భక్తులతో ఆలయాలు రద్దీని తలపించాయి. గ్రామ దేవతలు గండి మైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో కొలువు తీరిన అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో క్యూ లైన్లు అన్ని నిండిపోయాయి.
ఆషాఢ మాసం అది కూడా చివరి ఆదివారం కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా అమ్మ వారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.
ఫలహారపు బండ్ల ఊరేగింపులు. విచిత్ర వేషధారణలతో రహదారులపై భక్తులు నృత్యం చేశారు.
బోనాలతో భక్తులు ఊరేగింపుగా ఆలయాలకు తరలి వెళ్లారు.
అమ్మవారిని సైతం ఊరేగించారు.
తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా పండగ వాతావరణం నెలకొంది.
సంగారెడ్డిలో భక్తులతో ఆలయాలు రద్దీని తలపించాయి.
గ్రామ దేవతలు గండి మైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో కొలువు తీరిన అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో క్యూ లైన్లు అన్ని నిండిపోయాయి.
మరి కొద్ది రోజుల్లో అమవాస్య రానుంది. ఆ అమావాస్యతో ఆషాఢ మాసం ముగుస్తుంది.
ఆషాఢ మాసం వెళ్లిపోవడంతో.. శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో సైతం అమ్మవారి ఆలయాలు.. భక్తులతో కిటకిటలాడతాయి.
Updated Date - Jul 20 , 2025 | 08:43 PM