Mallu Bhatti Vikramarka: హైదరాబాద్లో నారెడ్కో సమావేశం.. పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ABN, Publish Date - Oct 11 , 2025 | 07:15 AM
హైదరాబాద్లో నారెడ్కో 15వ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో నారెడ్కో 15వ సమావేశం శుక్రవారం జరిగింది.
ఈ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వేగంగా దూసుకెళ్తుందని ఉద్ఘాటించారు మల్లు భట్టి విక్రమార్క.
బిల్డర్లు మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు మల్లు భట్టి విక్రమార్క.
భవిష్యత్తులో హైదరాబాదులో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే రానున్నాయని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం పట్టణ అభివృద్ధికి ప్రణాళిక వ్యయంలో భాగంగా బడ్జెట్లో రూ.10వేల కోట్లు కేటాయిస్తున్నామని గుర్తుచేశారు మల్లు భట్టి విక్రమార్క.
రెండు సంవత్సరాల్లో రూ.20 వేల కోట్లు కేటాయించి చేపట్టిన పనుల ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని వివరించారు.
ఈ పనులు హైదరాబాద్ రూపురేఖలను మారుస్తాయని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Updated Date - Oct 11 , 2025 | 07:16 AM