Home » Bhatti Vikramarka Mallu
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలోనే రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పాఠశాలల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్లను ఇవాళ(ఆదవారం) విడుదల చేశారు.
చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురికాకుండా ఆపాలనేది తమ ప్రభుత్వం ఆలోచన అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మూసీ నదిలో మంచినీరు పారించడం పార్కులు తయారు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన అని వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారంతా మంచి వాతావరణంలో బతికేలా చూడటమే ప్రభుత్వ ఉద్దేశమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోనే సంచలన ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో కీలకమైన ఉపముఖ్యమంత్రి ఇంట్లోనే దొంగలు పడ్డారు. భారీగా సొమ్ములను ఎత్తుకెళ్లారు. ఉపముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది..
ప్రతిపక్ష నేతలు అంటే తమకు గౌరవం ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఏం చేయాలో తమకు తెలుసునని మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. బీజేపీ ఉనికి కోసం రాజకీయ డ్రామాలు ఆడుతుందని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. పన్నుల నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50 శాతానికి కేంద్రం పెంచాలని అడిగారు. ప్రజా భవన్లో 16వ ఆర్థిక సంఘం సమావేశం ఈరోజు(మంగళవారం) జరిగింది. చైర్మన్, సభ్యులతో కూడిన ఈ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది.
గత పది సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు(గురువారం) రవీంద్ర భారతిలో గురుపూజోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నిన్న మొన్నటివరకు సుందరీకరణకు మారుపేరుగా ఉన్న ఖమ్మం నగరం ఒక్కరాత్రిలోనే మురికి కూపంగా మారింది. రెండు తెలుగురాష్ట్రాల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉన్న జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జలదిగ్భంధం అయింది. నగర పాలక సంస్థ పరిధిలోని ఒకటి, రెండు డివిజన్లు మినహా మిగిలిన అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించింది...
ఖమం జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయని తెలిపారు.
సింగరేణిని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భ్రష్టు పట్టించారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపణలు చేశారు.పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగా సభ ఈరోజు(శనివారం) జరిగింది. ఈ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ...కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు.