Home » Bhatti Vikramarka Mallu
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తెలంగాణ నుంచి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉన్నారు.
రైతు భరోసా, పంటల బీమా, రుణ మాఫీ పథకం విధి విధానాలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఈ అంశంపై చర్చించారు. పంట రుణాల రికవరీ కోసం రైతులను ఇబ్బందికి గురి చేయొద్దని బ్యాంకులకు, పరపతి సంఘాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 5 ఏళ్లలో సగం రోజులు మాత్రమే సీఎంగా ఉంటారని.. ప్రతిపక్షాలు తరచూగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి (Maheswara Reddy) కూడా హాట్ కామెంట్స్ చేశారు.
తుక్కుగూడ ‘జన జాతర’ భారీ బహిరంగ సభకు నేడు(శనివారం) కాంగ్రెస్ (Congress) పిలుపునిచ్చిది. ఈ బహిరంగ సభలో రాచకొండ పోలీస్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కాన్వాయిని అనుమతించకుండా అడ్డుకున్నారు. డిప్యూటీ సీఎం సిబ్బంది చెబుతున్న వినకుండా అడ్డుపడ్డారని చెప్పారు.
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దిక్కు కాంగ్రెస్ (Congress) మాత్రమేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. తుక్కుగూడలోని ‘ జన గర్జన’ సభ ఏర్పాట్లను గురువారం నాడు పరిశీలించారు.
తెలంగాణ ప్రజలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) మోయలేని భారం మోపారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. సోమవారం నాడు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ చెప్పేవన్నీ కట్టు కథలేనని అన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయ ఇన్చార్జ్ ఈఓ రామకృష్ణరావుపై బదిలీ వేటు పడింది. ప్రోటోకాల్ విషయంపై నిర్లక్ష్యం చేశారని ఆలయ ఈవోని దేవాదాయ ధర్మాదాయ శాఖ బదిలీ చేసింది. యాదగిరిగుట్ట కొత్త ఆలయ ఈవోగా భాస్కర్ రావు నియమించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగట్టన్ని సందర్శించారు.
యాదగిరి గుట్ట (Yadagirigutta) లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిన్న(సోమవారం) పర్యటించారు. ఆలయంలో ప్రత్యేక పూజల నిమిత్తం సీఎం రేవంత్ దంపతులు, నల్లొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ బల్లాపై కూర్చున్నారు. అయితే బల్లాపై ప్లేస్ లేకపోవడంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఓ చిన్న స్టూల్ మీద కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Telangana: రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చేశాయి. మంగళవారం నాడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడేవారని.. ఆర్టీసీ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు భావ ప్రకటన స్వేచ్చ ఉండేది కాదన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు బుద్ది చెప్పాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు.