Home » Bhatti Vikramarka Mallu
గ్రామ సర్పంచ్లుగా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. హాఫ్కు, ఫుల్కు ఆశపడి ఓటు వేస్తే గ్రామాలు దెబ్బతింటాయన్నారు. అందుకే రాజకీయ కక్షలు మాని.....
దేశాన్ని నడిపిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులను సృష్టించిన జేఎన్టీయూను జాతీయ ఆస్తిగా పరిగణించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం జేఎన్టీయూలో జరిగిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతిపై తెలంగాణ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని మంత్రులు కొనియాడారు.
బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయట ఉన్నారని ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డిల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. రేవంత్రెడ్డి ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఓవర్సీస్ విద్యార్థులకు గుడ్ న్యూస్. గత కొంత కాలంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
హైదరాబాద్లో రెండు సంవత్సరాల్లో రూ.20 వేల కోట్లు కేటాయించి చేపట్టిన పనుల ఫలితాలు ఇప్పుడే కనిపిస్తున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పనులు నగర రూపురేఖలను మార్చబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు హెచ్చరించారు. రేవంత్, మల్లు భట్టి విక్రమార్క బాండు పేపర్పై సంతకాలు పెట్టి ఎన్నికల హామీలిచ్చారని.. కానీ ఎన్నికల హామీలపై ఇప్పడెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు.
సింగరేణి బోర్డు బొగ్గు తవ్వకాలు పెంచడంతోపాటు ఇతర మినరల్స్ మైనింగ్ చేయాలని నిర్ణయం తీసుకుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాయచూరు, దేవదుర్గ ప్రాంతాల్లో కాపర్ అండ్ గోల్డ్ మైనింగ్ యాక్షన్లో సింగరేణి పాల్గొందని చెప్పుకొచ్చారు.
స్వయం ఉపాధి పథకాలు, ఇందిరమ్మ ఇళ్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలివ్వాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బ్యాంకర్లకు సూచించారు.
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధితో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా నిలిచిందని నొక్కిచెప్పారు.