CM Revanth Reddy: శామీర్పేట జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్కి శంకుస్థాపన.. పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి
ABN, Publish Date - Jul 16 , 2025 | 06:54 AM
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా తుర్కపల్లి జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయోలాజిక్స్ పరిశ్రమ నూతన యూనిట్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. పారిశ్రామిక విధానాలను మరింత మెరుగుపర్చుకుంటూ తెలంగాణను పెట్టుబడులకు నిలయంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఉద్ఘాటించారు.
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా తుర్కపల్లి జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయోలాజిక్స్ పరిశ్రమ నూతన యూనిట్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రిబ్బన్ కట్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్బాబు, వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి
పారిశ్రామిక విధానాలను మరింత మెరుగుపర్చుకుంటూ తెలంగాణను పెట్టుబడులకు నిలయంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు.
పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తామని, పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు సీఎం రేవంత్రెడ్డి.
తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్న పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
ప్రపంచ బల్క్ డ్రగ్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
దేశంలో 33 శాతం టీకాలను కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
బల్క్ డ్రగ్స్లో 40 శాతం ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు సీఎం రేవంత్రెడ్డి.
కొవిడ్ సమయంలో దాదాపు వంద దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత జీనోమ్ వ్యాలీకి దక్కిందని ఉద్గాటించారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.
జీవ శాస్త్రాల అభివృద్ధికి అవసరమైన ఎకో సిస్టమ్ హైదరాబాద్లో ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నొక్కిచెప్పారు.
Updated Date - Jul 16 , 2025 | 07:06 AM