CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025పై సమీక్షా సమావేశం
ABN, Publish Date - Nov 15 , 2025 | 06:48 AM
ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్లో నిర్వహించబోయే తెలంగాణ రైజింగ్ సమ్మిట్- 2025పై శుక్రవారం నాడు రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రైజింగ్ సమ్మిట్-2047 పాలసీ డాక్యుమెంట్ను ఆవిష్కరించుకోబోతున్నామని సీఎం పేర్కొన్నారు. ఇది తెలంగాణ భవిష్యత్కు రోడ్ మ్యాప్ అని అభివర్ణించారు. ఈ డాక్యుమెంట్ దేశ, విదేశీ పెట్టుబడిదారులకు ఒక మార్గదర్శక పత్రంలా ఉంటుందని తెలిపారు. శాఖలవారీగా పాలసీలకు సంబంధించి సమ్మిట్లో ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ గ్లోబల్ సమ్మిట్కు వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానాలు, ఇతర ఏర్పాట్లపై సమీక్షలో చర్చించామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్లో నిర్వహించబోయే తెలంగాణ రైజింగ్ సమ్మిట్- 2025పై శుక్రవారం నాడు రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రైజింగ్ సమ్మిట్-2047 పాలసీ డాక్యుమెంట్ను ఆవిష్కరించుకోబోతున్నామని సీఎం పేర్కొన్నారు.
ఇది తెలంగాణ భవిష్యత్కు రోడ్ మ్యాప్ అని అభివర్ణించారు.
ఈ డాక్యుమెంట్ దేశ, విదేశీ పెట్టుబడిదారులకు ఒక మార్గదర్శక పత్రంలా ఉంటుందని తెలిపారు.
శాఖలవారీగా పాలసీలకు సంబంధించి సమ్మిట్లో ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్రెడ్డి.
Updated Date - Nov 15 , 2025 | 06:48 AM