ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy inaugurates Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Sep 04 , 2025 | 07:26 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న(బుధవారం) పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ జిల్లా నుంచే లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం చండ్రుగొండలో భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రసంగించారు.

1/16

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు.

2/16

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి.

3/16

లబ్ధిదారులకు కానుకలు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

4/16

బెండాలపాడు గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బచ్చల నర్సమ్మ, రమణకు చెందిన ఇళ్లను సీఎం, మంత్రులు ప్రారంభించి, ఆయా కుటుంబాలతో గృహప్రవేశం చేయించారు.

5/16

ఈ సందర్భంగా బచ్చల నరసమ్మ నివాసంలో అల్పాహారం తీసుకున్నారు. అక్కడ నరసమ్మ మనవరాలు పాన్యశ్రీ వెన్సికకు గారె తినిపించి ముద్దుచేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

6/16

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి శ్రీకారం, గృహప్రవేశ మహోత్సవాలు రెండూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచే ప్రారంభమయ్యాయి.

7/16

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని గత ఏడాది మార్చి 11వ తేదీన పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ప్రారంభ సభ నిర్వహించారు.

8/16

ఆ సభలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు నమూనాను విడుదల చేసి కొందరు గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.

9/16

అనంతరం బుధవారం చంద్రుగొండ మండలం బెండాలపాడునుంచే ఇళ్లకు గృహప్రవేశ మహోత్సవాన్ని ఇక్కడి నుంచే నిర్వహించారు.

10/16

బెండాలపాడు గ్రామంలో 90 శాతం మంది గిరిజనులు ఉండగా.. భద్రాచలం సైతం గిరిజన ప్రాంతం కావడం విశేషం.

11/16

సీఎం రేవంత్‌రెడ్డి సభలో మాట్లాడుతుండగా ఆసక్తిగా వింటున్న ప్రజలు

12/16

ప్రజలతో కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

13/16

తెలంగాణ తొలి దశ ఉద్యమం ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైందని, తెలంగాణ ఉద్యమానికి దిశదశ చూపిందని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

14/16

'మా ఉద్యోగాలు మాకే కావాలని మా నీళ్లు మాకే కావాలి' అని ఉద్యమించిన చైతన్యవంతమైన జిల్లా ఇదని కొనియా డారు సీఎం రేవంత్‌రెడ్డి.

15/16

లబ్ధిదారులతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు

16/16

సభలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళాకారులు

Updated Date - Sep 04 , 2025 | 07:34 AM