Home » Bhadradri Kothagudem
రాజీవ్ లింక్ కెనాల్కు గోదావరి జలాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా లేక పంటల సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు.. సాగర్ ఆయకట్టుకు భరోసాగా మారిందని మంత్రి తెలిపారు.
కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని తెలంగాణ మంత్రి సీతక్క సూచించారు.
భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి పనులను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి పనుల గురించి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో భద్రాద్రి కొత్తగూడెం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటిమట్టం 55.90 అడుగులకు చేరింది. దాదాపు 15,84,657 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈరోజు(శుక్రవారం) ఉదయం భద్రాచలం వల్ల గోదావరి నీటి మట్టం 44 అడుగులకు చేరింది.
కేసీఆర్ హయాంలోని పదేళ్లలో ఇరిగేషన్పై లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సింగరేణిని అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ఆరోపించారు.
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మణుగూరులో పర్యటించారు. రెండో విడత ‘బాయిబాట’ రెండో రోజు పర్యటనలో భాగంగా మణుగూరు సింగరేణి పీకే ఓసీపీ-2ను సందర్శించారు.
సింగరేణిలో పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై యాజమాన్యం దృష్టి సారించాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ప్రభుత్వ విధానాలు, బకాయిల వల్ల సింగరేణిపై పెను భారం పడుతోందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామంలో పెద్దపులి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.