Kinnerasani Reservoir: నిండుకుండలా కిన్నెరసాని జలాశయం..
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:52 PM
ఎగువన భారీ వర్షాలకు వస్తున్న వరదతో పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. మంగళవారం 404.60 అడుగులకు చేరింది. దీంతో రాత్రి రెండుగేట్లను ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదలచేశారు.
- రెండు గేట్లు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీరు విడుదల
పాల్వంచ(భద్రాద్రి కొత్తగూడెం): ఎగువన భారీ వర్షాలకు వస్తున్న వరదతో పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం(Kinnerasani Reservoir) నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. మంగళవారం 404.60 అడుగులకు చేరింది. దీంతో రాత్రి రెండుగేట్లను ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదలచేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహబూబాబాద్, పాకాల కొత్తగూడ(Mahabubabad, Pakala Kothaguda) నుంచి గుండాల అటవీ ప్రాంతాల మీదుగా ఇల్లెందు,

కొత్తగూడెం, టేకులపల్లి(Yellendu, Kothagudem, Tekulapalli) నుంచి భారీగా వరద జలాశయానికి చేరుతోంది. దీంతో అధికారులు డ్యాం వద్దనే ఉంటూ తక్షణచర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరికలను జారీచేశారు. గేట్లను ఎత్తిన నేపథ్యంలో లోతట్టు ప్రజలు వాగులు దాటవద్దని హెచ్చరికలు చేశారు. రైతులు పరివాహక ప్రాంతంలో నాట్లు, పొలం పనులకు వెళ్లవద్దని తెలిపారు. గేట్లనుఎత్తడంతో పాల్వంచ, బూర్గంపాడు మండల అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...
‘కన్ఫర్డ్’లుగా 17 మంది సిఫారసు!
విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తీసేయండి
Read Latest Telangana News and National News