Home » Heavy Rains
వేసవి ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీకి వాతావరణ శాఖ అధికారులు చల్లటి కబురు చెప్పారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Rains) కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది.
ఈ వేసవిలో భానుడి తాపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 14వ తేదీ వరకు తేలికపాటి..
ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అయితే గన్నవరంలో కూడా భారీ వర్షం పడుతుండటం.. ఓ పక్కన తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రజాగళం సభ కూడా జరుగుతోంది.
తెలంగాణలో భారీ వర్షాలు పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాగే భారీ వర్షం, ఈదురుగాలులతో రాజధాని హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవడం, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు( మంగళవారం) సమీక్షించారు.
ఏపీలో ఈరోజు (మంగళవారం) పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నేడు సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు జిల్లాలో భారీ వర్షం పడింది. ఈ వర్షం ధాటికి ఏలూరు జిల్లాలోని లింగపాలెం మండలం యడవల్లి గ్రామానికి చెందిన పరస రామారావు (41) పిడుగుపాటుతో మృతి చెందారు. పశువులను మేపడం కోసం పొలంలో ఉండగా ఈ ఘటన జరిగింది.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు : భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. వారం రోజులుగా ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఊరట దొరకనుంది...
బ్రెజిల్(brazil) దేశంలో గత కొన్ని గంటలుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్లో భారీ వర్షాల(rains) కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటివరకు 39కి చేరుకోగా, మరో 60 మంది గల్లంతయ్యారు. కుండపోత వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది.
దుబాయిని(Dubai) గత 4 రోజులుగా వర్షాలు చుట్టు ముట్టాయి. భారీ వర్షాల ప్రభావంతో నగర వ్యాప్తంగా రహదారులు జలమయమయ్యాయి. అక్కడి పరిస్థితికి అద్దం పట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరం నడిబొడ్డున ఓ కారు వరదలో చిక్కుకుపోయింది. ఓ పిల్లి వరదలో కొట్టుకువచ్చింది. ఈదలేక.. దేన్నైనా ఆసరాగా చేసుకోవాలని భావించింది.
ఐఎండీ సూచనల ప్రకారం జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో రేపు(బుధవారం) భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రాజధాని చెన్నైతోపాటు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పలు నగరాలు నీట మునిగాయి. వీధులన్నీ జలమయమయ్యాయి. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నైలోని అన్ని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి.