Home » Heavy Rains
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
చెన్నై సహా ఆరు జిల్లాల్లో మూడురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుండటంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తమిళనాడు రాష్ట్రంలో కొండ ప్రాంతాలు, సముద్రతీరాల్లో ఉన్న 18 జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
భాగ్యనగరంలో గురువారం భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల రహదారులు నీటమునిగిపోగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణీ విస్తరించిందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులపాటు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఏపీలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.
తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 7 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు.
వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రకృతి విపత్తులపై సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జోరు వాన కురిసింది. 30 జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 621 మండలాలు ఉండగా.. 435 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.