Home » Heavy Rains
మహారాష్ట్ర(maharashtra)లోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు(heavy rains) కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్లపైకి నీరు పెద్ద ఎత్తున చేరి చెరవులను తలపిస్తున్నాయి. అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించి జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే వర్షం నేడు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ముంబై, రాయగడ, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఎడతెరిపి లేని వర్షాలు మహారాష్ట్రను వణికిస్తున్నాయి. రాజధాని ముంబై, ఐటీ సంస్థల కేంద్రం పుణెతో పాటు రాయ్గఢ్, పాల్ఘ ర్ జిల్లాల్లో వరుణుడు విజృంభిస్తున్నాడు. ముంబైలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది.
తుంగభద్ర జలాశయానికి(Tungabhadra Reservoir) వరద పెరుగుతోంది. పై ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉన్న తుంగ, భద్ర నదులు(Tunga and Bhadra rivers) ఉప్పొంగి తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి పెరుగుతోంది.
భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర(Maharashtra)లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ముంబై(Mumbai)లోని అంధేరి సబ్వేలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతోపాటు కుండపోత వర్షాలతో ముంబైలోని లోతట్టు ప్రాంతాలకు పెద్ద ఎత్తున నీరు చేరింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజా రవాణా సేవలకు అంతరాయం ఏర్పడి అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది.
Telangana: తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ఆయా ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, తాలిపేరు ప్రాజెక్ట్,
Andhrapradesh: జిల్లాలోని అరకులో విద్యుత్ సరఫరా నిలిచిచిపోయింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో అరకు పరిసర ప్రాంతాలలో గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలులు విపరీతంగా వీస్తుండడంతో విద్యుత్ వైర్లపై చెట్లు కొమ్మలు పడుతుండడం వలన విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు.
తుంగభద్ర(Tungabhadra)కు వరదపోటు ఎక్కువ కావడంతో సోమవారం సాయంత్రం జలాశయానికి చెందిన 15,16,17 క్రస్ట్గేట్ల గుండా 4వేల కూసెక్కుల నీటిని నదికి వదిలారు.
భద్రాద్రి కొత్తగూడెం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. 51.10 అడుగుల వద్ద 13,18,860 క్యూసెక్కుల వరద ఉధృతి పెరిగింది. 53 అడుగులు దాటగానే మూడో ప్రమాద హెచ్చరిక జారీ కానుంది.
సీజన్ మొదలై నెలన్నర దాటినా.. మొన్నటివరకు వానలు పెద్దగా లేనే లేవు..! ఈ ఏడాది వర్షాభావం తప్పదా? అన్న ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో వరుణుడు కరుణిస్తున్నాడు..! తెలంగాణలోనే కాక.. ఎగువ రాష్ట్రాల్లోనూ వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో కృష్ణమ్మ బిరబిరా తరలివస్తోంది.
గోదావరి వరద ఉధృతమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు పెడుతోంది.