Home » Rains
ఢిల్లీ NCRలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) ఉత్తర శ్రీలంక తీరాన్ని దాటే అవకాశముంది. ఏపీపై ప్రభావం పరిమితంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలు, రైతులు, మత్స్యకారులు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం అవసరం..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 24 గంటల్లో ఈ వాయుగుండం తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో గాలుల వేగం పెరగడం, సముద్ర పరిస్థితులు మారడం వంటి ప్రభావాలు కనిపించవచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని, దీని ప్రభావంతో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. 9వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కేరళ తీరం వెంబడి ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రంలో.. ఐదు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో రానున్న 48 గంటల వరకు ఆకాశం మేఘావృతంగా ఉంటుందని తెలిపింది.
సౌదీ అరేబియాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జెడ్డా, మక్కా సమీపంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నుంచి కురిసిన వర్షంతో రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి, రాబోయే రెండు రోజులు వాతావరణం ఇలాగే కొనసాగుతుందని హెచ్చరించింది.
చెన్నై నగర శివారు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. దిత్వా తుపాన్ నగరాన్ని ముంచెత్తింది. అయితే... ప్రస్తుతం తుపాన్ ప్రభావం లేకున్నా ఎక్కడ చూసినా బురద, చెత్తాచెదారం, దర్శనమిస్తోంది.
గత నాలుగు రోజులుగా చెన్నై నగరం, శివారు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు కాస్త తెరపిచ్చాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. ఇళ్లనుంచి బయటకు కూడా రాలేకపోయారు. అయితే.. కాస్త తెరపివ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
చెన్నై శివారు ప్రాంతాలన్నీ.. ఇంకా.. జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ‘దిత్వా’ తుఫాను వల్ల రాజధాని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలన్నీ తడిసి ముద్దయిపోయాయి. తుపాన్ వల్ల జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించిపోయింది. ప్రజానీకం ఇళ్లనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.