Home » Rains
Andhra Pradesh Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం(Weather) మారిపోయింది. మొన్నటి వరకు ఎండలు(Summer Temperature) దంచికొట్టగా.. ఇప్పుడు వాతావరణం కాస్త చల్లబడింది. పలు చోట్ల వర్షాలు(Rains) కూడా కురుస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది.
Rains in Hyderabad: హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒక్కసారి వాతావరణం మారిపోయి నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి.
భారీ వర్షాలు యూఏఈని(UAE) అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఈ వర్షాల(Heavy Rains) కారణంగా ప్రభావితమైన భారతీయుల(Indians) సహాయార్ధం దుబాయ్లోని(Dubai) భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.
75 ఏళ్ల చరిత్రలో కనివీని ఎరుగని విధంగా కురిసిన అకాల వర్షాలు.. దుబాయ్ను అతలాకుతలం చేశాయి. ఈ వరద బీభత్సానికి ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. రాజన్నసిరిసిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన భాస్కర్ అనే ఓ ప్రవాసీయుడు.. జలప్రళయానికి భయపడి కారులోనే గుండె ఆగి చనిపోయాడు.
దుబాయ్లో వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఏడాది మొత్తం కురవాల్సిన వర్షం.. కొన్ని గంటల వ్యవధిలో కురిసిందిని అధికారులు తెలిపారు. మరోవైపు..
ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా వేసవి ( Summer ) ఎండలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఉదయం 7 నుంచే మొదలయ్యే ఎండ సాయంత్రం 7 అయినా తగ్గడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు చిరు చినుకులు ( Rains ) ఉపశమనం కలిగించాయి.
వేసవి ప్రారంభానికే ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని ( Telangana ) కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44.5 డిగ్రీలు దాటేసింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించేలా వడగాలులు వీచాయి.
రైతాంగానికి చల్లని కబురు... గతేడాది వాతావరణ శాఖ అంచనా వేసిన దానికంటే ఏడు రోజులు ఆలస్యంగా భారత్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈ సారి నిర్ణీత తేదీకంటే ముందుగానే రానున్నాయి. ప్రపంచంలో అనేక దేశాల వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిన సూపర్ ఎల్నినో క్షీణత వేగంగా సాగుతుండడంతో.. వచ్చేనెల నాటికి తటస్థ పరిస్థితులు, జూన్కల్లా లానినా దశ ప్రారంభమవుతుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలుఅంచనా వేస్తున్నాయి.
వేసవి మండిపోతోంది. ఉదయం నుంచే సూర్యుడు భగభగలాడిపోతున్నాడు. ఇక మధ్యాహ్నం అయితే నిప్పుల కుంపటి నెత్తి మీద పెట్టుకున్నట్టే ఉంటోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.