Home » Rains
తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. కర్ణాట, ఆంధ్రప్రదేశ్(Karnataka, Andhra Pradesh) రైతుల జీవనాడి నిండుకుండలా తొణికిసలాడుతోంది. డ్యాం పైప్రాంతం నుంచి జలాశయంలోకి ఇన్ఫ్లో 80 వేలకు పైగా క్యూసెక్కులుగా నమోదయ్యింది.
Dengue Symptoms and Prevention Tips: వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. తద్వారా వ్యాధులు కూడా పెరుగుతాయి. అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ఈ డెంగ్యూ అన్ని వయసుల వారికి వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు..
మహారాష్ట్ర(maharashtra)లోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు(heavy rains) కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్లపైకి నీరు పెద్ద ఎత్తున చేరి చెరవులను తలపిస్తున్నాయి. అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించి జనజీవనం అస్తవ్యస్తమైంది. అయితే వర్షం నేడు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ముంబై, రాయగడ, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర(Maharashtra)లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ముంబై(Mumbai)లోని అంధేరి సబ్వేలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతోపాటు కుండపోత వర్షాలతో ముంబైలోని లోతట్టు ప్రాంతాలకు పెద్ద ఎత్తున నీరు చేరింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజా రవాణా సేవలకు అంతరాయం ఏర్పడి అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. జ్వరాలు, చికున్గున్యా, మలేరియా, టైఫాయిడ్ కేసులూ పెరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం సమీక్షిస్తున్నారని, జిల్లాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.
సీజన్ మొదలై నెలన్నర దాటినా.. మొన్నటివరకు వానలు పెద్దగా లేనే లేవు..! ఈ ఏడాది వర్షాభావం తప్పదా? అన్న ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో వరుణుడు కరుణిస్తున్నాడు..! తెలంగాణలోనే కాక.. ఎగువ రాష్ట్రాల్లోనూ వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో కృష్ణమ్మ బిరబిరా తరలివస్తోంది.
గోదావరి వరద ఉధృతమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు పెడుతోంది.
హైదరాబాద్: మరో రెండు రోజులపాటు భాగ్యనగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. సిటీకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా మూడు రోజులుగా నగరాన్ని ముసురు వీడడంలేదు. జంట జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. హుస్సేన్ సాగర్ అయితే నిండు కుండలా తలపిస్తోంది.
గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద స్వల్పంగా పెరిగి 10.90 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 175 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలారు.