Home » Rains
చెన్నై శివారు ప్రాంతాలన్నీ.. ఇంకా.. జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ‘దిత్వా’ తుఫాను వల్ల రాజధాని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలన్నీ తడిసి ముద్దయిపోయాయి. తుపాన్ వల్ల జనజీవనం ఎక్కడికక్కడే స్థంభించిపోయింది. ప్రజానీకం ఇళ్లనుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
రాజధాని చెన్నై నగరం తడిసి ముద్దవుతోంది. ఒకరోజు మొత్తం వర్షం విపరీతంగా కురవడంతో జనజీవనం అతలాకుతమైంది. ‘దిత్వా’ తుఫాన్ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా.. వర్షం కారణంగా మంగళవారం చెన్నై సహా 4 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ అధికారులు తెలిపారు. తుఫాను దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గత ఆరు గంటల్లో ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరప్రాంతాల్లో 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదిలిన దిత్వా.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.
దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జైన్ తెలిపారు. తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోందని వివరించారు.
దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ శ్రీలంక తీరం దిశగా నెలకొన్న వాయుగుండం ‘దిత్వా’ తుపానుగా మారి నగరానికి చేరువగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
శ్రీలంకను భారీ వర్షాలు, వరదలు ఊపిరిసలపనివ్వడంలేదు. జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. పాఠశాలలు, కార్యాలయాలు మూసివేశారు. వరుస ప్రమాద హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇప్పటి వరకూ 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు. వర్షాల ప్రభావంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ శ్రీలంక తదితర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కాస్తా.. తీవ్రంగా మారింది. మరికొన్ని గంటల్లో ఇది తీరం దాటుతుంది.