చిరుతలకు నిలయంగా భారత్ ఉండటం గర్వకారణం: ప్రధాని మోదీ
ABN, Publish Date - Dec 04 , 2025 | 12:25 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు(డిసెంబర్ 4న) అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ చొరవతో మధ్యప్రదేశ్ ముడేళ్ల క్రితం చిరుత ప్రాజెక్ట్ బహుమతిని అందుకుంది. నమీబియా నుండి కునో జాతీయ ఉద్యానవనానికి 8 చిరుతలను తీసుకువచ్చారు. ప్రస్తుతం, కునో పాల్పూర్, గాంధీ సాగర్ అభయారణ్యంలో చిరుతల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(డిసెంబర్ 4న) అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ చొరవతో మధ్యప్రదేశ్ ముడేళ్ల క్రితం చిరుత ప్రాజెక్ట్ బహుమతిని అందుకుంది.
నమీబియా నుండి కునో జాతీయ ఉద్యానవనానికి 8 చిరుతలను తీసుకువచ్చారు. ప్రస్తుతం కునో పాల్పూర్, గాంధీ సాగర్ అభయారణ్యంలో చిరుతల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.
భూమి మీద అత్యంత అద్భుతమైన జీవుల్లో ఒకటైన చిరుతను రక్షించడానికి అంకితభావంతో ఉన్న వన్యప్రాణుల ప్రేమికులు, పరిరక్షకులందరికీ విషెష్ అంటూ అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ప్రధాని పోస్ట్ పెట్టారు.
మూడేళ్ల క్రితం ఈ అద్భుతమైన జంతువును రక్షించామని, పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం అనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించిందని మోదీ తెలిపారు.
గతంలో కోల్పోయిన పర్యావరణ వారసత్వాన్ని పునరుద్ధరించడానికి, మన జీవవైవిధ్యాన్ని బలోపేతం చేయడానికి కూడా ఇది ఒక ప్రయత్నమంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
అనేక చిరుతలకు భారత్ నిలయంగా ఉండటం గర్వంగా ఉందని, అలానే అవి గణనీయమైన సంఖ్యలో భారత గడ్డపై జన్మించాయని తెలిపారు.
Updated Date - Dec 04 , 2025 | 12:25 PM