Home » Narendra Modi
'ఇండియా' కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది తేలకపోవడంతో ఏడాదికి ఒకరిని ప్రధాన మంత్రి చేసే ఆలోచనలో ప్రస్తుతం విపక్ష కూటమి ఉన్నట్టు తెలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ లోని బేతుల్లో బుధవారంనాడు ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.
దేశ సంపదన, ఆడవాళ్ల నగలను కాంగ్రెస్ దోచుకుని ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచిపెడుతుందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తోసిపుచ్చారు. 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన నగలను విరాళంగా ఇచ్చారని చెప్పారు.
తెలంగాణలో మెజారిటీ లోక్సభ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ‘‘ఎన్డీయే కూటమి గెలవనున్న 400 పైగా
గోవాపై భారత రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దారంటూ దక్షిణ గోవా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విరీయటో ఫెర్నాండెజ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందంటూ మండిపడ్డారు.
'జై-వీరు' పేర్లు చెప్పగానే 1975లో విడుదలైన 'షోలే' చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర పాత్రలే గుర్తుకు వస్తాయి. ఆ చిత్రంలో ధర్మేంద్ర సరసన కథానాయకిగా నటించిన హేమమాలిని తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షాలను భారత రాజకీయాల్లో 'జై-వీరు'లతో పోల్చారు. విపక్షాలను 'గబ్బర్'గా అభివర్ణించారు.
కాంగ్రెస్ హయాంలో 'హనుమాన్ చాలీసా' వినడం కూడా నేరంగా చూసేవారని, ఇందువల్ల రాజస్థా్న్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఏడాది తొలిసారిగా 'రామనవమి' సందర్భంగా రాష్ట్రంలో శోభా యాత్ర ఊరేగింపు జరిగిందని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్పీడ్కు బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రాకూండా అడ్డుకట్టవేసేందుకు విపక్ష ఇండియా కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను విడుదల చేయగా.. ఏడు అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది.
టెస్లా చీఫ్, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్(Elon Musk) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత పర్యటన వాయిదా పడింది. ఏప్రిల్ 21, 22 తేదీలలో ఎలాన్ మస్క్ భారతదేశ పర్యటన ప్రతిపాదించబడింది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని ఎలాన్ మస్క్ కలవనున్నారు. కానీ అంతలోనే ట్విస్ట్ చోటుచేసుకుంది.
దేశానికి రాజైనా తల్లికి కొడుకేననే నానుడు మరోసారి రుజువైంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు జరుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఎన్నికల ర్యాలీలో తన తల్లి హీరాబెన్ ఫోటో చూసి భావోద్వాగానికి గురయ్యారు. తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపేశారు.
ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని రాంలాలా ఆలయంలో శ్రీరామునికి సూర్య తిలకం ఏర్పడింది. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) తాజాగా అసోం(assam)లోని నల్బరి(Nalbari) నుంచి రామ్ లల్లా సూర్య తిలకాన్ని ట్యాబ్ ద్వారా వీక్షించి దర్శించుకున్నారు.