Home » Narendra Modi
దాయాది పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను సైన్యం తిప్పికొడుతుందని ప్రదానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘‘ఉగ్రవాద ఘాతుకాలు, దొంగ యుద్ధాలతో కవ్వింపు చర్యలకు పాకిస్థాన్ పాల్పడుతూనే ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం శనివారం జరగనుంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 'నీతి ఆయోగ్' 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో శనివారంనాడు జరుగనుంది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ఈ సమావేశం జరుగుతుందని శుక్రవారంనాడు ఒక అధికార ప్రకటన వెలువడింది.
సైన్యంలో సంస్కరణల కోసం అగ్నిపథ్ పథకం తీసుకువచ్చామని, విపక్షాలు మాత్రం ఈ పథకంపై యువతను తప్పుదారి పట్టించేలా విమర్శలు చేస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'కార్గిల్' దివస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టారు. మోదీ ఆబద్ధాలు వ్యాప్తి చేస్తూ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు.
నేడు (జులై 26) కార్గిల్ విజయ్ దివస్(Kargil Vijay Diwas) 25వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) లడఖ్(Ladakh)లోని కార్గిల్లో పర్యటించనున్నారు. ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన రజతోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.
విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి.. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2024లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2024పై తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు..
Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్ (Union Budget 2024)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త పుంతలు తొక్కించే బడ్జెట్ ఇదని, యువతకు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు లభిస్తాయని అన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై భారతదేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారంటూ నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.