77వ గణతంత్ర దినోత్సవ పరేడ్ పది ప్రత్యేకతలు
ABN , Publish Date - Jan 26 , 2026 | 08:58 AM
ఈరోజు భారత్ తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ దగ్గర ఘనంగా జరుపుకుంటోంది. 'వందే మాతరం' రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాని వారసత్వాన్ని ఘనంగా స్మరించుకోవడంతోపాటు, పరేడ్ లోని పది ప్రత్యేకతలేంటో చూద్దాం.
న్యూఢిల్లీ, జనవరి 26: ఈరోజు భారతదేశం తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద ఘనంగా జరుపుకుంటోంది. ఈ ఏడాది పరేడ్ ప్రత్యేకతలు..
1. 'వందే మాతరం' రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాని వారసత్వాన్ని ఘనంగా స్మరించుకోవడం. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ్ 1876లో రచించిన ఈ గేయం స్వాతంత్ర్య సమరంలో ప్రేరణాత్మక శక్తిగా నిలిచింది. ఈ మైలురాయిని పరేడ్లో ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నారు. థీమ్.. '150 Years of Vande Mataram'
2. భారతదేశ అభివృద్ధి ప్రయాణం, సైనిక బలం, సాంస్కృతిక వైవిధ్యం, పౌరుల భాగస్వామ్యం (Jan Bhagidari)తో కూడిన అద్భుతమైన ప్రదర్శన ఈ ఏడాది పరేడ్లో భాగం.
3. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులు. ఇది భారత్-యూరోపియన్ యూనియన్ సంబంధాలకు ప్రతీక.
4. పరేడ్ ఫార్మాట్లో మొదటిసారిగా ఫేజ్డ్ బ్యాటిల్ అరే (పోరాట శ్రేణి) ఫార్మాట్లో సైన్యం ప్రదర్శన. భారత సైన్యం వైమానిక భాగస్వామ్యం (aerial component)తో కలిపి బలమైన యుద్ధ సన్నాహాలను చూపించబోతోంది.
5. యాక్టివ్ కంబాట్ యూనిఫాంలో 61 క్యావలరీ (61 గుర్రపు సైన్యం), ఇండిజినస్ ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ (హై మొబిలిటీ రికనైసెన్స్), ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అండ్ ఆర్మ్డ్ వెర్షన్ రుద్ర, అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ వంటి ఇండిజినస్ ఆయుధాలు ప్రదర్శిస్తారు. 21-గన్ సెల్యూట్ (105 mm లైట్ ఫీల్డ్ గన్స్తో) సైనిక ప్రదర్శనలు ఈ పరేడ్ లో మరో ప్రత్యేకత.
6. సాంస్కృతిక భాగం.. 'భిన్నత్వంలో ఏకత్వం (Unity in Diversity)' థీమ్తో కనీసం 100 మంది కళాకారుల ప్రదర్శన. వందే మాతరం పాటపై పెయింటింగ్స్ (1923లో తేజేంద్ర కుమార్ మిత్ర రూపొందించినవి) ప్రదర్శన. టేబులాక్స్ ద్వారా దేశ అభివృద్ధి, సాంస్కృతిక వైవిధ్యం చూపించబోతున్నారు.
7. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం అర్పించడం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ జెండా ఎగురవేయడం, వందేమాతరం, 21-గన్ సెల్యూట్ తర్వాత పరేడ్ ప్రారంభమవుతుంది. పరేడ్ ఉదయం 10:30 గంటలకు మొదలై 90 నిమిషాలు కొనసాగనుంది.
8. పరమ్ వీర్ చక్ర, అశోక చక్ర విజేతలు (యోగేంద్ర సింగ్ యాదవ్, సంజయ్ కుమార్, CA పిఠవాలియా, DS శ్రీరామ్ కుమార్ వంటివారు) కూడా ఈ వేడుకలో పాల్గొంటారు.
9. ఈ పరేడ్ భారతదేశ సైనిక బలం, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి ప్రయాణాన్ని ఒకేసారి ప్రపంచానికి చాటబోతోంది.
10. వందే మాతరం 150 ఏళ్ల తర్వాత కూడా భారతీయుల్లో దేశభక్తి జ్వాలను రగిలిస్తోందని ఈ పరేడ్ నిరూపించబోతోంది.
ఇవి కూడా చదవండి..
త్వరలోనే మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి గణతంత్ర ప్రసంగం
ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్
Read Latest National News