Home » Droupadi Murmu
దేశవ్యాప్తంగా సైనిక స్కూళ్లను 'ప్రైవేటుపరం' చేయాలనే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారంనాడు ఒక లేఖ రాశారు. సైనిక స్కూళ్ల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇందుకు సంబంధించి చేసుకున్న ఎంఓయులను రద్దు చేయాలని కోరారు.
దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణికి ప్రదానం చేస్తున్న సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలుచుని ఉండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూర్చుని ఉండటంపై జార్ఖాండ్ ముక్తి మోర్చా ఆక్షేపణ తెలిపింది. ఆమె గిరిజన మహిళ అయినందునే రాష్ట్రపతిని ప్రధాని అవమానించారని విమర్శించింది.
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. హోలీ రంగులు దేశ వైవిధ్యానికి ప్రతీకలని ఆమె అన్నారు.
కేరళ ప్రభుత్వం అసాధారణ చర్యకు దిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులపై సంతకాలు చేయకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసాధారణ జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. మతంతో సంబంధం లేకుండా వివాహాలు, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వ చట్టాలు అందరికీ ఒకేరీతిలో వర్తించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, బిల్లు సభామోదం పొందింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu)కు లేఖ రాశారు. అగ్నిపథ్ పథకం కారణంగా సాయుధ దళాలలో యువతకు అన్యాయం జరుగుతోందని వారి ఉపాధి పోతోందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. డిజిటల్ రూపంలోనే బడ్జెట్ సమర్పించనున్నారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Drowpadi Murmu) ఇరు సభలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.
వికసిత భారతావనిని నిర్మించే పనిలో గడిచిన పదేళ్లలో ఎన్నో మైలు రాళ్లు చేరుకున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆమె ఉభయసభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.
భారత 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మ గురువారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక జాతినుద్దేశించి ఆమె ప్రసంగించడం ఇది రెండోసారి.