Home » Droupadi Murmu
పోలీసు పహారాలో పుట్టపర్తి కొనసాగుతోంది. సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు దేశంలోని ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో పుట్టపర్తిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 19న భారత ప్రధాని నరేంద్రమోదీ, 22, 23 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పుట్టపర్తికి రానున్నారు.
రఫేల్ ఫైటర్ జెట్ను నడిపిన తొలి ఇండియన్ మహిళా పైలట్గా శివాంగి సింగ్ రికార్డుల్లో నిలిచారు. దీనికి ముందు ఆమె అంబాలోని గోల్డెన్ యారోస్ స్వ్కాడ్రన్లో విధులు నిర్వహించారు.
భారత వైమానికి దళానికి చెందిన రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విహరిస్తున్నారు. ముందుగా భద్రతా దళాల నుంచి సైనిక వందనం స్వీకరించారు.
అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇండియాతో సంబంధాల పునరుద్ధణకు ఆసక్తి కనబరుస్తూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గత మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రహస్య లేఖ రాసినట్టు 'బ్లూమ్బెర్గ్' ఒక కథనం ప్రచురించింది.
మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025'ను లోక్సభ ఈనెల 20న ఆమోదించగా, 21న రాజ్యసభ ఆమోదం పొందింది.
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కిషన్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కిషన్రెడ్డి ముందుగా చట్టం చదవాలని సూచించారు. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదని స్పష్టం చేశారు. బీసీఈకి ఇప్పటికే 4శాతం రిజర్వేషన్లు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు.
రాష్ట్రపతిపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాల నిడిమాండ్ చేశారు. రాజకీయాలకు సంబంధం లేని రాష్ట్రపతి గురించి మాట్లాడడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
బీసీ బిల్లుకు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలపాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు జరిగితే.. దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలుస్తుందని తెలిపారు.
అమిత్షా తన కసరత్తులో భాగంగా పలువురు బీజేపీ నేతలు, అప్పటి జమ్మూకశ్మీర్ రాష్ట్ర బీజేపీ చీఫ్లతో సమావేశమైనట్టు కూడా చెబుతున్నారు. ప్రధానమంత్రి మోదీ సైతం మంగళవారంనాడు ఎన్డీయే ఎంపీలతో కీలక సమావేశం జరుపనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి ఆదివారం సమావేశమైనట్టు రాష్ట్రపతి భవన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది. ఆ తర్వాత కొద్ది గంటలకు మళ్లీ రాష్ట్రపతి భవన్ మరో ట్వీట్లో హోం మంత్రి అమిత్షా రాష్ట్రపతిని కలుసుకున్నట్టు వెల్లడించింది.