Home » Droupadi Murmu
ఆమ్ ఆద్మీ పార్టీని వీడిన ఎంపీలపై పంజాబ్ ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లేందుకు అపాయింట్మెంట్ కోరారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఎన్డీయే ఎంపీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి లోకేశ్, ఎన్డీయే ఎంపీలు కృతజ్ఞతలు తెలియజేశారు.
రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayana Singh) తిరిగి రాజ్యసభకు రానున్నారు. ఆయనను రాజ్యసభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు.
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ కొనసాగే అవకాశముంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను శుక్రవారం నామినేట్ చేశారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని గురువారం నాడు దర్శించారు. బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంపుల్ కాంప్లెక్స్లో 'రామ యంత్ర' ప్రతిష్ఠలో పాల్గొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకునేందుకు అపాయింట్మెంట్ కోరిన తృణమూల్ కాంగ్రెస్ నేతలకు నిరాశ ఎదురైంది. పశ్చిమబెంగాల్లో గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించేందుకు 12 మంది సభ్యుల టీఎంసీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరింది.
పశ్చిమబెంగాల్లో పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారంటూ తృణమూల్ కాంగ్రెస్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించడంతో కేంద్రం, మమతా సర్కార్ మధ్య రాజకీయ వివాదం తీవ్రమైంది. తాజాగా మమతా బెనర్జీ 2024 నాటి ఒక ఫొటోను షేర్ చేశారు.
పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్కు హాజరయ్యేందుకు జరిపిన పర్యటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిప్పికొట్టారు. ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని స్పష్టంచేశారు.
పశ్చిమ బెంగాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రధాని మోదీ మండిపడ్డారు. రాష్ట్రపతి ముర్ముని మమతా ప్రభుత్వం అవమానించిందన్నారు.
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో సంతల్ సమావేశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సంతల్ సమాజం సంస్కృతి భాగస్వామ్యం, గౌరవాన్ని కొనసాగించాలని సూచించారు.