ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్
ABN, Publish Date - Sep 13 , 2025 | 08:00 AM
భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. రాధాకృష్ణన్ తమిళ సంప్రదాయ దుస్తులు, ఎర్ర కుర్తా ధరించి వచ్చిన ఆయన.. భగవంతుడిపై ఆంగ్లంలో ప్రమాణం చేశారు.
భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు.
శుక్రవారం ఉదయం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్తో పదవీ ప్రమాణం చేయించారు.
రాధాకృష్ణన్ తమిళ సంప్రదాయ దుస్తులు, ఎర్ర కుర్తా ధరించి వచ్చిన ఆయన.. భగవంతుడిపై ఆంగ్లంలో ప్రమాణం చేశారు.
రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, హమీద్ అన్సారీ, పార్లమెంటు సభ్యులు కూడా పాల్గొన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సైతం సతీసమేతంగా హాజరవడమే గాక.. అందరినీ నవ్వుతూ పలకరించడం గమనార్హం.
అనారోగ్య కారణాలతో జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో సెస్టెంబరు 9వ తేదీన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరిగింది. ‘ఇండీ’ కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డిపై 152 ఓట్ల ఆధిక్యంతో రాధాకృష్ణన్ విజయం సాధించడం తెలిసిందే.
ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన రాధాకృష్ణన్ ఇక రాజ్యసభ చైర్మన్గానూ వ్యవహరించనున్నారు.
2030 సెప్టెంబరు 11వ తేదీ వరకు రాధాకృష్ణన్ పదవిలో కొనసాగనున్నారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ మాత్రమే కనిపించారు.
మల్లికార్జున ఖర్గేతో రాధాకృష్ణన్ కరచాలనం చేశారు. ఈ కార్యక్రమానికి మిగతా ప్రతిపక్షాల నేతలెవరూ హాజరవలేదు.
రాజ్యసభ చైర్మన్ చాంబర్లో రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సహాయ మంత్రులు అర్జున్రామ్ మేఘ్వాల్, ఎల్.మురుగన్ స్వాగతం పలికారు.
Updated Date - Sep 13 , 2025 | 10:17 AM