Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ
ABN, Publish Date - Sep 28 , 2025 | 08:53 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ సారధ్యంలో గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యులు, నటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (చిన్ని), ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు ముత్తవరపు మురళీకృష్ణ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, సొసైటీ ఫర్ వైబ్రేంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ సారధ్యంలో గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యులు, నటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాలకృష్ణకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.
బాలకృష్ణకు స్వాగతం పలుకుతున్న ఎంపీ కేశినేని శివనాథ్
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ కేశినేని శివనాథ్
జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ని ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ.
కార్యక్రమంలో మాట్లాడుతున్న బాలకృష్ణ
ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (చిన్ని) ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, సొసైటీ ఫర్ వైబ్రేంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కేశినేని శివనాథ్తో మాట్లాడుతున్న బాలకృష్ణ.
బాలకృష్ణకు ప్రతిమను బహుకరించిన నిర్వాహకులు.
కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు..
కార్యక్రమంలో సింగర్ సునీత మ్యూజిక్ షో..
పుష్కరకాలం తర్వాత విజయవాడలో ఎగ్జిబిషన్ మళ్లీ పున ప్రారంభించడం ఆనందంగా ఉందని నందమూరి బాలకృష్ణ వ్యాాఖ్యానించారు.
క్యాన్సర్ బాధితులకు బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు నందమూరి బాలకృష్ణ.
అమరావతిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు నందమూరి బాలకృష్ణ.
ఈ హాస్పిటల్ వల్ల పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వివరించారు నందమూరి బాలకృష్ణ.
Updated Date - Sep 28 , 2025 | 08:57 AM